Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లెబనాన్ క్షిపణి ప్రయోగం.. ఇజ్రాయెల్‌లో కేరళ వాసి మృతి.. ఇద్దరికి గాయాలు

లెబనాన్ క్షిపణి ప్రయోగం.. ఇజ్రాయెల్‌లో కేరళ వాసి మృతి.. ఇద్దరికి గాయాలు

సెల్వి

, మంగళవారం, 5 మార్చి 2024 (09:00 IST)
లెబనాన్ నుండి ప్రయోగించిన యాంటీ ట్యాంక్ క్షిపణి ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దు సంఘం మార్గాలియోట్ సమీపంలోని పండ్ల తోటను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక భారతీయ జాతీయుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. బాధితులు ముగ్గురు దక్షిణాది రాష్ట్రమైన కేరళకు చెందిన వారని అధికారులు చెప్పారు. 
 
సోమవారం ఉదయం 11 గంటలకు ఉత్తర ఇజ్రాయెల్‌లోని గెలీలీ ప్రాంతంలోని మోషవ్‌లోని మార్గలియోట్‌ ప్లాంటేషన్‌ను ఈ క్షిపణి ఢీకొట్టిందని రెస్క్యూ సర్వీసెస్ మాగెన్ డేవిడ్ ఆడమ్ (MDA) ప్రతినిధి జాకీ హెల్లర్ తెలిపారు. 
 
ఈ దాడిలో కేరళలోని కొల్లంకు చెందిన పట్నీబిన్ మాక్స్‌వెల్ మృతి చెందాడు. అతని మృతదేహాన్ని జివ్ ఆసుపత్రిలో గుర్తించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అలాగే బుష్ జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్ గాయపడ్డారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన ఆ ఇద్దరు..