Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవాజ్ షరీఫ్ మెడకు పనామా పేపర్ ఉచ్చు... విచారణకు రావాల్సిందే.. పాక్ సుప్రీంకోర్టు

పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన మెడకు పనామా పేపర్స్ లీక్ వ్యవహారం ఉచ్చు బిగించే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం (జిట్) ఎదుట షరీఫ్ విచారణక

నవాజ్ షరీఫ్ మెడకు పనామా పేపర్ ఉచ్చు... విచారణకు రావాల్సిందే.. పాక్ సుప్రీంకోర్టు
, గురువారం, 20 ఏప్రియల్ 2017 (15:35 IST)
పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన మెడకు పనామా పేపర్స్ లీక్ వ్యవహారం ఉచ్చు బిగించే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం (జిట్) ఎదుట షరీఫ్ విచారణకు హాజరుకావాల్సిందేనంటూ ఆదేశ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పైగా, ఈ కేసులో నవాజ్ షరీఫ్ ఫ్యామిలీ పాత్రపై కూడా విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. 
 
పైగా, ఈ కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేసి, 60 రోజుల్లోనే నివేదికను సమర్పించాలంటూ జిట్‌ను ఆదేశించింది. అంటే మరో రెండు నెలల్లో షరీఫ్ భవితవ్యం తేలిపోనుంది. షరీఫ్‌పై కోర్టు విచారణకు ఆదేశించడంతో పాలనపై సైన్యం పట్టుబిగించేందుకు సిద్ధమవుతోంది. పనామా పేపర్స్ వ్యవహారంలో షరీఫ్ రాజీనామా చేయాలని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్ తొలి నుంచీ డిమాండ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబు వెడ్డింగ్ మెమొరీస్... చంద్రబాబు కన్నతండ్రినే తోసేసిన జనం...