Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో ఓవర్ లోడ్... కుప్పకూలి 19 మంది మృతి

ఓ విమాన సిబ్బంది పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నందుకు భారీ మూల్యమే చెల్లించుకుంది. విమానం కుప్పకూలిపోవడంతో ఏకంగా 19 మంది మృత్యువాతపడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన దక్షిణ

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (09:44 IST)
ఓ విమాన సిబ్బంది పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నందుకు భారీ మూల్యమే చెల్లించుకుంది. విమానం కుప్పకూలిపోవడంతో ఏకంగా 19 మంది మృత్యువాతపడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన దక్షిణ సూడాన్‌లో జరిగింది.
 
నిజానికి ఈ విమానంలో కేవలం 19 మంది మాత్రమే ప్రయాణం చేయడానికి అనుమతి ఉంది. కానీ, విమాన సిబ్బంది మాత్రం 23 మందిని ఎక్కించుకున్నారు. ఈ ఫ్లైట్ జుబా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యిరోల్‌ నగరానికి బయలుదేరిన కమర్షియల్ విమానం కాసేపటికే ఓ సరస్సులో కుప్పకూలింది. 
 
ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలతో బయటపడిన నలుగురిలో ఆరేళ్ల బాలిక, మరో చిన్నారి, ఇటాలియన్ వైద్యుడు, ఓ యువకుడు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరిలో వైద్యుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

దేవరలో స్టెప్పులేయనున్న పూజా హెగ్డే?

ఇంతటితో నా జీవితం ముగిసింది: కన్నీళ్లు పెట్టిస్తున్న ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ సురభి చివరి పోస్ట్

తండ్రీ కొడుకు మధ్య సాగే కథతో భజే వాయు వేగం టీజర్ : మెగాస్టార్ చిరంజీవి

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ పెద్ద విజయాన్ని సాధించాలి : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

పదిమందికి పని కల్పించడంలో చాలా ఆనందం వుంది: నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల

టొమాటో రసం తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

రోగనిరోధక శక్తిని పెంచే 4 సహజ ఆహారాలు

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే పదార్థాలు ఏమిటి?

పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

క్యారెట్ రసం ఎందుకు తాగుతారో తెలుసా?

తర్వాతి కథనం
Show comments