Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అప్పుడు శ్రీలంక.. ఇప్పుడు సిరియా.. చిన్నారులు కన్నీళ్లు, రక్తపు మరకలతో?

సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అజాద్‌ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటుదారుల మధ్య పోరాటం జరుగుతోంది. సిరియాలో ప్రభుత్వానికి, తిరుగుబాటు దారులకు మధ్య జరుగుతున్న పోరు ఉధృతమైంది. ఈ క్రమంలో సిరియాలో జరుగుతున్న

అప్పుడు శ్రీలంక.. ఇప్పుడు సిరియా.. చిన్నారులు కన్నీళ్లు, రక్తపు మరకలతో?
, మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (13:03 IST)
సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అజాద్‌ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటుదారుల మధ్య పోరాటం జరుగుతోంది. సిరియాలో ప్రభుత్వానికి, తిరుగుబాటు దారులకు మధ్య జరుగుతున్న పోరు ఉధృతమైంది. ఈ క్రమంలో సిరియాలో జరుగుతున్న సైనిక పోరు కారణంగా గత తొమ్మిది రోజుల్లో 700 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 
 
సిరియాలో గుండెలు పిండేసే ఘటన చోటుచేసుకుంటున్నా.. భారత్‌లో సినీనటి శ్రీదేవి మరణంపై మీడియా మొత్తం ఫోకస్ చేస్తోంది. ఏం జరుగుతుందో తెలియక ఆడుకునే చిన్నారులు.. సిరియాలో బాంబుల మోత వింటున్నారు. రక్తమోడే వీధులను చూస్తున్నారు. సిరియాలో చోటుచేసుకున్న ఈ విషాదానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
వీటిపై సెలెబ్రిటీలు తమ పోస్టుల ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ హాస్యనటుడు వివేక్ తన ట్విట్టర్ పేజీలో చిన్నారులు కన్నీళ్లతో రక్తపు మరకలను చూస్తే గుండె తరుక్కుపోతోంది. అప్పుడు శ్రీలంక.. ఇప్పుడు సిరియా.. చనిపోయేది.. చిన్నారులు మాత్రమే.. అంటూ వివేక్ కామెంట్స్ చేశారు.

ఇదిలా ఉంటే.. సిరియాలో జరుగుతున్న యుద్ధ సన్నివేశాలను చూపెట్టేందుకు.. రష్యా ఛానల్ వీడియో గేమ్ ఫుటేజీలను వాడుతుంది. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భయానక సంఘటనలు చోటుచేసుకుంటున్న సిరియా యుద్ధానికి వీడియో గేమ్‌ల ఫుటేజీని వాడటం ఏమిటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీదేవిది హత్యే.. బాత్‌టబ్‌లో మునిగి చనిపోవడం అసాధ్యం: సుబ్రహ్మణ్య స్వామి