Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాలిఫోర్నియాలో కవల పిల్లలతో పాటు దంపతుల మృతి.. ఏమైంది?

crime scene

సెల్వి

, బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (21:30 IST)
అమెరికాలో భారతీయులపై దాడి ఒకవైపు.. మరణాలు మరోవైపు పెరిగిపోతున్నాయి. తాజాగా కాలిఫోర్నియాలో భారతీయ-అమెరికన్ కుటుంబం శవమై కనిపించింది. ఇందులో కవలపిల్లలు వుండటం దారుణం. 
 
వివరాల్లోకి వెళితే.. ఫిబ్రవరి 13న కాలిఫోర్నియాలోని శాన్ మాటియోలోని ఇద్దరు పిల్లలతో సహా నలుగురితో కూడిన భారతీయ-అమెరికన్ కుటుంబం శవమై కనిపించిందని పోలీసులు తెలిపారు.
 
 సాన్ మాటియో పోలీస్ డిపార్ట్‌మెంట్ బాధితుల్లో ఇద్దరు తుపాకీ గాయాలతో బాధపడ్డారని, మిగిలిన ఇద్దరి మరణానికి కారణం ఇంకా తెలియరాలేదని చెప్పారు. మృతులను ఆనంద్ సుజిత్ హెన్రీ (42), అతని భార్య ఆలిస్ ప్రియాంక (40), వారి కవల పిల్లలుగా గుర్తించారు. విషాదకరంగా, ఇద్దరు పిల్లలు పడకగదిలో చనిపోయారు. వారి మరణానికి కారణం ఇంకా విచారణలో ఉంది. 
 
బాత్‌రూమ్‌లో గన్‌షాట్‌ల కారణంగా దంపతులు మరణించారు. బాత్‌రూమ్‌లో 9 ఎంఎం పిస్టల్, లోడ్ చేసిన మ్యాగజైన్ కూడా కనుగొనబడ్డాయని శాన్ మాటియో పోలీసులు తెలిపారు. 
 
భారతీయ-అమెరికన్ దంపతులు ఐటీ నిపుణులు. ఆనంద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేయగా, ఆలిస్ సీనియర్ అనలిస్ట్‌గా పనిచేశారు. ఆమె రెండేళ్ల క్రితం శాన్ మాటియో కౌంటీకి మారింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాట్‌జిపిటిని ఉపయోగిస్తున్న సైబర్ హ్యాకర్లు.. బీ కేర్ ఫుల్