Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దావూద్ ఇబ్రహీం ఇంకా బతికే వున్నాడు.. వార్తలు వైరల్

dawood ibrahim
, బుధవారం, 20 డిశెంబరు 2023 (19:21 IST)
ముంబై పేలుళ్ల సూత్రధారి, భారత్ మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. ఆరోగ్యం క్షీణించడంతో దావూద్ ఇటీవల కరాచీలోని ఆగాఖాన్ యూనివర్సిటీ హాస్పిటల్లో చేరినట్లు వార్తలు వచ్చాయి. దావూద్‌కు వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఈ పరీక్షలకు సమయం పడుతుందని కూడా ఆ వర్గాలు వెల్లడించాయి. 
 
దావూద్ గ్యాంగ్ లీడర్ గత కొన్నాళ్లుగా పలుమార్లు మరణించినట్లు వార్తలు వచ్చాయి. 1993 ముంబై వరుస పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం కొన్నాళ్లుగా పాకిస్థాన్‌లో తలదాచుకున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
 
భారతదేశంలో ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి అనేక ఆరోపణలను ఎదుర్కొంటున్న దావూద్ ఇబ్రహీం 2003లో గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించబడ్డాడు. అతను డిసెంబర్ 1955లో మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జన్మించాడు. తరువాత అతని కుటుంబం ముంబైలోని డోంగ్రీ ప్రాంతానికి మారింది. 1970లో ముంబై అండర్ వరల్డ్‌లో భాగమయ్యాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తీవ్ర జ్వరంలోనూ యువగళం సభకు హాజరైన పవన్ కళ్యాణ్