Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అందాల పోటీల్లో విజేత.. వేదికపైనే స్పృహ తప్పి పడిపోయింది..

అందాల పోటీల్లో విజేత.. వేదికపైనే స్పృహ తప్పి పడిపోయింది..
, శనివారం, 27 అక్టోబరు 2018 (11:25 IST)
అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. కానీ ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోయింది. వేదికపైనే స్పృహ కోల్పోయింది. ఈ ఘటన మిస్ పరాగ్వే పోటీల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురువారం మయన్మార్‌లోని యాంగాన్‌లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 పోటీల్లో పరాగ్వే బ్యూటీ క్లారా సోసా విజేతగా ఎంపికైనట్టు నిర్వాహకులు ప్రకటించారు. 
 
అంతే తన పేరు వినగానే ఆనందాన్ని తట్టుకోలేక స్పృహ తప్పి స్టేజీపైనే కుప్పకూలిపోయింది. రన్నరప్ అయిన భారత భామ మీనాక్షి చౌదరి వెంటనే స్పందించి ఆమెను కదిలించింది. దీంతో కోలుకున్న సోసా తేరుకుని లేచి చేతులూపి నవ్వుతూ కన్నీళ్లు పెట్టుకుంది. 
 
అంతకుముందు జరిగిన ఇంటర్వ్యూలో సోసా మాట్లాడుతూ.. విజేతగా నిలిస్తే ప్రపంచంలో హింస, యుద్ధాలకు పుల్‌స్టాప్ పెట్టాలంటూ తొలుత ఏ దేశంలో ప్రచారం చేస్తారన్న ప్రశ్నకు సోసా స్పందిస్తూ తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలుస్తానని పేర్కొంది. 
 
ఇతర దేశాలకు అమెరికా ఓ ఉదాహరణ అని, కాబట్టి తొలుత తాను ట్రంప్‌ను కలుస్తానని వివరించింది. విజేతగా నిలిచిన అనంతరం మాట్లాడుతూ.. ఆనందం పట్టలేక స్పృహ తప్పిపోయానని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ జగన్ పచ్చినెత్తురు తాగే వ్యక్తి.. ఏపీలో జగన్నాటకం.. కేశినేని నాని