Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్‌ను తాకిన కావేరి సెగ.. చెన్నై టీమ్‌కు కష్టాలు తప్పవా?

కావేరి సెగ ఐపీఎల్‌ను తాకింది. కావేరి బోర్డును ఏర్పాటు చేయని కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ సభ్యులు నల్ల బ్యాడ్జి ధరించి క్రికెట్ మైదానంలో ఆడాలని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సూచించారు. అయితే ఐపీఎల్ మ్యాచ

ఐపీఎల్‌ను తాకిన కావేరి సెగ.. చెన్నై టీమ్‌కు కష్టాలు తప్పవా?
, మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (11:01 IST)
కావేరి సెగ ఐపీఎల్‌ను తాకింది. కావేరి బోర్డును ఏర్పాటు చేయని కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ సభ్యులు నల్ల బ్యాడ్జి ధరించి క్రికెట్ మైదానంలో ఆడాలని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సూచించారు. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డుకోవాలని ఇప్పటికే తమిళ సంఘాలు పిలుపునిచ్చాయి. స్టేడియంలో అలజడి సృష్టించేందుకు నిరసనకారులు సమాయత్తం అవుతున్నారు. చెన్నై ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డుకునే దిశగా నిరసనకారులు భారీగా టిక్కెట్లు కొన్నట్లు సమాచారం.
 
ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. తొలి మ్యాచ్‌లో విజయాన్ని అందించిన ఆల్ రౌండర్ కేదార్ జాదవ్ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. కేదార్ జాదవ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 7.8 కోట్లకు కొనుగోలు చేసింది.
 
జట్టు కోరుకున్నట్టే ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఓపెనర్‌‌గా క్రీజులోకి దిగిన కేదార్ జాదవ్‌ తొడ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్‌ హర్ట్‌‌గా వెనుదిరిగాడు. కీలక దశలో మళ్లీ క్రీజులోకి వచ్చిన కేదార్.. జట్టుకు విజయాన్ని చేకూర్చాడు. కానీ గాయం తీవ్రత అధికంగా వుండటంతో టోర్నీ నుంచి కేదార్ జాదవ్ దూరమైనట్లు కోచ్ మైకేస్ హస్సీ చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య హసీన్‌కు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన షమీ: అంత సీన్ లేదన్న?