Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"కుర్చి మడత పెట్టి"పై అశ్విన్ ప్రశంసలు.. మహేష్-శ్రీలీల ఇరగదీశారు..

gunturu karam

సెల్వి

, బుధవారం, 20 మార్చి 2024 (11:49 IST)
గుంటూరు కారం ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రం అభిమానులను నిరాశపరిచింది. కానీ ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని "కుర్చి మడత పెట్టి" పాట పెద్ద హిట్‌ అయింది. శ్రీలీల, మహేష్‌ల డ్యాన్స్ వైరల్‌గా మారింది.
 
తాజాగా ఈ పాటపై భారత క్రికెటర్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఈ పాట పెద్ద హిట్ అయ్యిందని, మహేష్-శ్రీలీల ఇద్దరూ బాగా డ్యాన్స్ చేశారని అశ్విన్ కొనియాడాడు. 
 
ఈ పాటను ఇంకా చూడని వారిని యూట్యూబ్‌లో చూడమని ప్రోత్సహించాడు. శ్రీలీల నృత్య నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ, మహేష్ బాబును అసాధారణమైన డ్యాన్సర్‌గా అభివర్ణించాడు.
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్టుకు ఈ పాట ఊపందుకోవచ్చని అశ్విన్ సూచించాడు. అశ్విన్ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల 100 టెస్టులు పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న్యూయార్క్ వేదికగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ ఆవిష్కరణ