Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబై ఇండియన్స్ మెంటార్ బాధ్యతలకు సచిన్ బైబై

sachin tendulkar
, సోమవారం, 18 డిశెంబరు 2023 (12:20 IST)
ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ మెంటార్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రకటించారు. 2008లో జట్టు ప్రారంభం నుండి జట్టుతో వున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తన నిష్క్రమణకు వ్యక్తిగత కారణాలను సచిన్ పేర్కొన్నాడు. ఈ వార్త అభిమానులకు మరియు క్రికెట్ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 
 
ఎందుకంటే జట్టుకు టెండూల్కర్ చేసిన సేవలు అమూల్యమైనవి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కుటుంబంలో భాగమయ్యే అవకాశం లభించినందుకు టెండూల్కర్ కృతజ్ఞతలు తెలిపాడు. 
 
టెండూల్కర్ మెంటార్‌షిప్‌లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా అవతరించింది. ఈ జట్టు 2013, 2015, 2017, 2019, 2020లో ఐదుసార్లు టైటిల్‌ను గెలుచుకుందిరు. మైదానంలో, వెలుపల టెండూల్కర్ అందించిన సహకారం జట్టు స్థిరమైన విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాథన్ లియాన్ అదుర్స్.. 500 వికెట్లతో టాప్ ఆటగాళ్ల సరసన చేరాడు..