Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జియో దిపావళి ధమాకా... ఈనెల 5 నుంచి...

జియో దిపావళి ధమాకా... ఈనెల 5 నుంచి...
, ఆదివారం, 4 నవంబరు 2018 (10:08 IST)
దేశీయ టెలికాం రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన రిలయన్స్ జియో.. మరో శుభవార్త తెలిపింది. ఈ కంపెనీ ప్రవేశపెట్టిన జియో ఫీచర్ ఫోన్ ప్రతి ఒక్కరికీ చేరువయ్యేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 5వ తేదీ నుంచి ఓపెన్ సేల్‌ ప్రకటించింది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈనెల 5 నుంచి 12 వరకు జియో.కామ్‌లో ఈ ఫోన్‌ను ఓపెన్‌ సేల్‌ ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. 
 
రిలయన్స్ జియో ఆగస్టు 15వ తేదీన అత్యాధునిక ఫీచర్లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా జియో ఫోన్‌ 2ను రూపొందించింది. అయితే, ఈ ఫోన్ కేవలం జియో.కామ్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఫ్లాష్‌ సేల్స్‌లో మాత్రమే విక్రయిస్తూ వచ్చింది. కానీ, పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈనెల 5 నుంచి 12 వరకు జియో.కామ్‌లో ఈ ఫోన్‌ను ఓపెన్‌ సేల్‌లో అందుబాటులో ఉంచనుంది. 
 
ఈ సేల్‌లో పేటీఎం వాలెట్‌ ద్వారా చెల్లింపులు జరిపేవారికి రూ.200 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కూడా లభిస్తుంది. రూ.2,999 ధరతో ఉన్న ఈ ఫోన్‌ క్వెర్టీ కీప్యాడ్‌ను కలిగి ఉంటుంది. 4జీ డ్యుయల్‌ సిమ్‌తో కూడిన ఈ ఫోన్‌ పలు జియో యాప్స్‌ కూడా కలిగి ఉంటుంది. తాజాగా వాట్సప్‌ను కూడా జత చేశారు. ఈ ఫోన్‌ వాడకందారుల కోసం జియో ప్రత్యేకంగా రూ.49, రూ.99, రూ.153 రీఛార్జి ప్యాక్‌లను రూపొందించింది. ఈ ప్యాక్‌లన్నీ 28 రోజుల చెల్లుబాటుతో ఉంటాయి. 
 
ఈ ఫోన్‌లో అన్ని ప్యాక్‌లలో జియో యాప్‌లను కాం ప్లిమెంటరీగా ఇస్తున్నారు. ఈ ఫోన్‌ 512 ఎంబీ ర్యామ్‌ను కలిగి ఉంది. 4జీబీ స్టోరేజితోపాటు మైక్రో ఎస్‌డీకార్డు ద్వారా 128జీబీ వరకు మెమరీ పెంచుకోవచ్చు. 2మెగా పిక్సెల్‌ బ్యాక్‌ కెమెరా, వీజేఏ ఫ్రంట్‌ కెమెరా, 2,000ఎంఎహెచ్‌ బ్యాటరీ, ఎఫ్‌ఎం రేడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాల్మీకిని అలా మార్చొచ్చు... వేమనలోని ఆ గుణాన్ని అణచొచ్చు... కానీ బాబును మార్చలేం..