Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కృష్ణా పుష్కరాలు 2016... ఏ వాహ‌నం, ఎక్క‌డ నిల‌పాలి...?

విజ‌య‌వాడ‌: కృష్ణా పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చే బస్సులు, రైళ్లను ఎక్క‌డ నిలుపుతారో వివ‌రాల‌ను అధికారులు వెల్ల‌డించారు. ఆగస్టు 12 నుంచి పుష్క‌రాలు ముగిసే వ‌ర‌కు నిర్దేశిత ప్రాంతాల్లో వాహ‌నాలు నిలపాలని ఆర్టీసీ, రైల్వే అధికారులు ఆదేశి

కృష్ణా పుష్కరాలు 2016... ఏ వాహ‌నం, ఎక్క‌డ నిల‌పాలి...?
, గురువారం, 11 ఆగస్టు 2016 (21:52 IST)
విజ‌య‌వాడ‌: కృష్ణా పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చే బస్సులు, రైళ్లను ఎక్క‌డ నిలుపుతారో వివ‌రాల‌ను అధికారులు వెల్ల‌డించారు. ఆగస్టు 12 నుంచి పుష్క‌రాలు ముగిసే వ‌ర‌కు నిర్దేశిత ప్రాంతాల్లో వాహ‌నాలు నిలపాలని ఆర్టీసీ, రైల్వే అధికారులు ఆదేశించారు. 
 
*  బస్సులు ఆపే ప్రాంతాలు : హైదరాబాద్ రూటులోంచి వచ్చే బస్సులను ఇబ్రహీంపట్నం జాకీర్ హుస్సేన్ కాలేజ్ వరకు అనుమతి 
*  ఏసీ బస్సులకు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు అనుమతి.
*  తిరువూరు, మైలవరం నుంచి వచ్చే బస్సులకు ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్  ఎ- కాలనీలో స్టాప్ ఏర్పాటు.
* విశాఖపట్నం నుంచి వచ్చే బస్సులను వైవీ రావ్ ఎస్టేట్ వద్ద నిలిపివేత
* తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి  జిల్లాల నుంచి వచ్చే బస్సులను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద నిలిపివేత
*  మచిలీపట్నం, అవనిగడ్డ వైపు నుంచి వచ్చే బస్సులను కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద నిలిపివేత
* తిరుపతి నుంచి ఆ రూట్ లో వచ్చే బస్సులను గుంటూరు బస్ స్టేషన్ వరకు అనుమతి - అక్కడి నుంచి గుంటూరు-విజయవాడ పుష్కర్ స్పెషల్ షటిల్ సర్వీసులు.
 
*  రైళ్లు నిలుపుదల ప్రాంతాలు  :  హైదరాబాద్ నుంచి వచ్చే పుష్కర్ స్పెషల్ ట్రైన్లను రాయనపాడు వరకు అనుమతి.
*  విశాఖపట్నం నుంచి వచ్చే పుష్కర్ స్పెషల్ ట్రైన్లను రామవరప్పాడు, గుణదల స్టేషన్లలో నిలుపుదల.
* గుంటూరు వైపు నుంచి, తెనాలి వైపు నుంచి వచ్చే పుష్కర్ స్పెషల్ ట్రైన్లను కృష్ణా కెనాల్ జంక్షన్ వరకూ అనుమతి - అక్కడ నుంచి పుష్కర్ స్పెషల్ బస్సుల్లో విజయవాడ చేరుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణా పుష్కర స్నానం శుక్రవారం ఉ.5.54 ప్రారంభం... ప్రతి 3 నిమిషాలకు ఓ ఉచిత ఆర్టీసి బస్సు