Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శివనామ స్మరణలతో మారుమ్రోగుతున్న శ్రీకాళహస్తి

ద్రాక్షారామం నుంచి శ్రీశైలం వరకు శ్రీకాళహస్తి నుంచి కోటిలింగాల వరకు శైవాలయాలు శివనామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం కావడంతో ఉమ్మడి రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ప్రముఖ వాయులింగక్షేత్రం శ్రీకాళహస్తి భక్తులతో పోటెత

శివనామ స్మరణలతో మారుమ్రోగుతున్న శ్రీకాళహస్తి
, శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (15:50 IST)
ద్రాక్షారామం నుంచి శ్రీశైలం వరకు శ్రీకాళహస్తి నుంచి కోటిలింగాల వరకు శైవాలయాలు శివనామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం కావడంతో ఉమ్మడి రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ప్రముఖ వాయులింగక్షేత్రం శ్రీకాళహస్తి భక్తులతో పోటెత్తింది. ఉదయం నుంచే ఆలయం వద్ద భక్తులు బారులుతీరి కనిపిస్తున్నారు. ఉపవాస దీక్షలతో స్వామివారికి బిల్వార్చన చేస్తే ఎంతో మంచిదని పురాణాలు చెబుతున్నాయి. దీంతో భక్తులు ఉదయం నుంచే ఆలయానికి అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు.
 
శ్రీకాళహస్తి ఆలయ దర్శనార్థం వచ్చిన భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యాన్ని కలిగించేలా దేవస్థానం చర్యలు తీసుకుంటోంది. భక్తుల మధ్య ఎలాంటి తోపులాటలు జరుగకుండా దేవస్థానం అధికారులు జాగ్రత్త పడుతున్నారు. రాత్రికి స్వామివారి లింగోద్భవ దర్శనం జరుగనుంది. ఇప్పటికే ఎపి ప్రభుత్వం తరపున స్వామివారికి దేవదాయశాఖామంత్రి మాణిక్యాలరావు ఆలయానికి పట్టు వస్త్రాలను సమర్పించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహాశివరాత్రి.. తెలుగు రాష్ట్రాల్లో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు.. క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు..