Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జయలలిత-కరుణకు భారతరత్న ఇవ్వాలి.. అమ్మ విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో?

తమిళనాడులో నువ్వా నేనా అంటూ పోటీపడిన రాజకీయ నాయకులు జయలలిత, కరుణానిధి ఇక లేరు. అన్నాడీఎంకే, డీఎంకే సారథులుగా వ్యవహరించిన ఈ ఇద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తమిళనాట మరో డిమాండ్ క్రమం

జయలలిత-కరుణకు భారతరత్న ఇవ్వాలి.. అమ్మ విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో?
, సోమవారం, 13 ఆగస్టు 2018 (11:29 IST)
తమిళనాడులో నువ్వా నేనా అంటూ పోటీపడిన రాజకీయ నాయకులు జయలలిత, కరుణానిధి ఇక లేరు. అన్నాడీఎంకే, డీఎంకే సారథులుగా వ్యవహరించిన ఈ ఇద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తమిళనాట మరో డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది.


దివంగత జయలలితకు భారతరత్న ఇవ్వాలంటూ అన్నాడీఎంకే శ్రేణులు డిమాండ్ చేస్తుంటే... కరుణానిధిని దేశ అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించాలని డీఎంకే శ్రేణులు కూడా డిమాండ్ చేస్తున్నాయి. 
 
రాష్ట్రానికి ఐదు సార్లు సీఎంగా వ్యవహరించి, తన జీవితంలో 8 దశాబ్దాల పాలు ప్రజాసేవకు అంకితమైన కరుణను భారతరత్నతో గౌరవించాలని డీఎంకే నేత తిరుచ్చి శివ తాజాగా డిమాండ్ చేశారు. ఇప్పటికే కరుణ కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి కూడా ఇదే విషయంపై ఢిల్లీ పెద్దలతో చర్చించారు.

మరోవైపు, జయలిలతకు భారతరత్న ఇవ్వాలంటూ తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ప్రధాని నరేంద్ర
మోదీకి లేఖ రాశారు. అంతేకాదు, జయలలిత విగ్రహాన్ని పార్లమెంటు ఆవరణలో పెట్టాలంటూ అన్నాడీఎంకే డిమాండ్ చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనుమానం పెనుభాతమైంది.. కత్తిపీటతో భార్య పీక కోసిన భర్త.. ఎక్కడ?