Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దోపిడీకి వెళ్లి.. మహిళపై అత్యాచారం చేశాడు..

దోపిడీకి వెళ్లి.. మహిళపై అత్యాచారం చేశాడు..
, సోమవారం, 19 నవంబరు 2018 (14:02 IST)
మహిళలపై అత్యాచారాలు, దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా బెంగళూరులో దోపిడీకి వచ్చిన ఓ దుండగుడు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు కురుబరహల్లికి చెందిన దేవరాజ్ (21) బెంగళూరులోని ఓ ఫర్నీచర్ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆ డబ్బు సరిపోక రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. 
 
ఈ క్రమంలో ఓ మహిళ ఇంట్లో దొంగతానికి వెళ్లాడు. ఆ ఇంట్లో ఆ మహిళ ఒంటరిగా నివసిస్తోంది. దీన్ని అదనుగా తీసుకుని.. దేవరాజ్ ఒంటరి మహిళ ఇంట్లోకి వచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఇంట్లోని వస్తువులను దోచుకెళ్లాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దేవరాజ్‌పై ఆరు కేసులు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ ఆరోజు నా వీపుపై లాగి ఒక్కటిచ్చారు... తలుపు దగ్గర పడ్డా... లక్ష్మీపార్వతి