Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాహుల్ గాంధీ మాన‌స్ స‌రోవ‌ర్ యాత్ర - బీజేపికి కాంగ్రెస్ స‌వాల్..!

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్ర‌స్తుతం కైలాస్ మానస సరోవర్ యాత్రలో ఉన్నారు. ఆయ‌న అక్టోబర్‌లో దుబాయ్ పర్యటించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఏ తేదీన ఆయన వెళ్తారనేది ఇంకా నిర్ణయం కాలేదు. దుబాయ్‌లో 50,000 మంది పట్టే ఒక స్టేడియాన్ని

రాహుల్ గాంధీ మాన‌స్ స‌రోవ‌ర్ యాత్ర - బీజేపికి కాంగ్రెస్ స‌వాల్..!
, సోమవారం, 10 సెప్టెంబరు 2018 (10:59 IST)
కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్ర‌స్తుతం కైలాస్ మానస సరోవర్ యాత్రలో ఉన్నారు. ఆయ‌న అక్టోబర్‌లో దుబాయ్ పర్యటించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఏ తేదీన ఆయన వెళ్తారనేది ఇంకా నిర్ణయం కాలేదు. దుబాయ్‌లో 50,000 మంది పట్టే ఒక స్టేడియాన్ని బుక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. స్టేడియం బుక్ కాగానే రాహుల్ పర్యటన తేదీపై పార్టీ అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయ‌ని తెలిసింది.
 
ప్రస్తుతం 12 రోజుల కైలాస్ మానస సరోవర్ యాత్ర పర్యటనలో ఉన్న రాహుల్ అక్కడ్నించి రాగానే మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే... రాహుల్ మానస సరోవర్ యాత్ర గురించి కేంద్రానికి సమాచారం ఇవ్వకపోవడంపై ఇప్పటికే బీజేపీ విమర్శనాస్త్రాలు ఎక్కుబెడుతోంది. 
 
భారతదేశ పౌరుడిగా కాకుండా చైనా అంబాసిడర్‌గా రాహుల్ వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. బీజేపీ విమ‌ర్శ‌ల‌కు కాంగ్రెస్ సైతం దీటుగానే స్పందించింది. ఇంత‌కీ ఏమ‌న్న‌దంటే... రాహుల్ మానస్ సరోవర్ యాత్రలో ఎన్ని కిలోమీటర్లు నడిచారో లెక్కలు చెబుతూ మీరెవరైనా అలా చేయగలరా అంటూ బీజేపీకి ప్రతిసవాలు విసిరింది. మ‌రి.. బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హ్యాపీ యానివర్సరీ మామ్ అండ్ డాడ్ : నారా లోకేశ్