Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహారాష్ట్ర మంత్రికి కరోనా

మహారాష్ట్ర మంత్రికి కరోనా
, శుక్రవారం, 12 జూన్ 2020 (19:11 IST)
కరోనా వైరస్ కేసుల్లో దేశంలోనే టాప్ ప్లేస్ లో ఉన్న మహారాష్ట్రలో తాజాగా మరో మంత్రికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. సామాజిక న్యాయ శాఖ మంత్రి ధనుంజయ్ ముండేతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు, ఇద్దరు డ్రైవర్లు, కుక్ తో సహా ఐదుగురు సిబ్బందికి వైరస్ సోకిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం ప్రకటించారు.

అంతకుముందు రోజు జరిగిన కేబినెట్ భేటీలో ధనుంజయ్ పాల్గొన్నారు. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలో ఆందోళన మొదలైంది. ఇంతకుముందే ఇద్దరు మంత్రులు జితేంద్ర అవద్(ఎన్సీపీ), అశోక్ చవాన్(కాంగ్రెస్)​లకు కరోనా సోకింది.

అయితే వీరిద్దరు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. వీరిద్దరికీ ఏప్రిల్ 13న వారి సెక్యూరిటీ సిబ్బంది ద్వారా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 94,041 కేసులు నమోదు కాగా.. 3,438 మంది వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. 44,517 మంది కోలుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దుర్గా దేవి ఆలయంలో సాఫీగా దర్శనాలు