Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉచితంగా చికెన్ ఇవ్వలేదని దళితుడిని చెప్పులతో చావగొట్టారు...

Dalit Man Trashed
, ఆదివారం, 13 ఆగస్టు 2023 (11:00 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అణగారిన వర్గాలకు చెందిన ప్రజలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలు రకాలైన దాడి ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా ఓ దళితుడిపై చెప్పులతో చావబాదారు. ఇంతకీ అతను చేసిన నేరం ఏంటంటే.. ఉచితంగా చికెన్ ఇవ్వకపోవడమే. దీంతో అతనిపై చెప్పులతో చావగొట్టారు. ఈ ఘటన లలిత్ పూర్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
లలిత్‌పూర్ జిల్లాలో ఓ దళిత వ్యక్తి ఊరారా తిరుగుతూ చికెన్ అమ్మే వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో కొందరు యువకులు ఉచితంగా చికెన్ ఇవ్వాలని అడిగ్గా, అందుకు నిరాకరించాడు. దీంతో అతనిపై రోడ్డుపైనే చెప్పులతో చావబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. మద్యం మత్తులో ఉన్న నిందితులు బాధితుడు సుజన్ అహిర్వాన్‌ను నడిరోడ్డుపై చెప్పులతో కొడుతుండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. 
 
బైకుపై తిరుగుతూ గ్రామాల్లో చికెన్‌ విక్రయించే అహిర్వార్ వద్ద నిందితులు చికెన్ తీసుకున్నారు. డబ్బులు అడగడంతో ఆగ్రహించిన నిందితులు... అతడిని పట్టుకుని ఈడ్చుకుంటూ చెప్పులతో దాడి చేశారు. తనను వదిలేయాలని ఎంతగానో ప్రాధేయపడినా కనికరం చూపలేదు కదా మరింతగా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు... నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - వాతావరణ శాఖ హెచ్చరిక