Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంట్లో మందుకొట్టి గోలగోల... తొంగి చూడగానే యువతిని గట్టిగా వాటేసుకుని...

ఢిల్లీలో మరో యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. తాను నివశించే అపార్ట్‌మెంట్‌లోనే కొందరు మద్యంబాబులు ఓ యువతిపై సామూహిక అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. ఈ ఘటన న్యూఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్, మనేసర

ఇంట్లో మందుకొట్టి గోలగోల... తొంగి చూడగానే యువతిని గట్టిగా వాటేసుకుని...
, ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (16:45 IST)
ఢిల్లీలో మరో యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. తాను నివశించే అపార్ట్‌మెంట్‌లోనే కొందరు మద్యంబాబులు ఓ యువతిపై సామూహిక  అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. ఈ ఘటన న్యూఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్, మనేసర్ పారిశ్రామికవాడలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మనేసర్ పారిశ్రామికవాడకు చెందిన ఓ యువతి ఓ మల్టీనేషనల్ కంపెనీలో పని చేస్తున్నారు. ఆమె రాత్రి 10 గంటల సమయంలో విధులు ముగించుకుని ఇంటికి వచ్చి మెట్ల మార్గం ద్వారా రెండో అంతస్తుకు వెళుతోంది. ఆ సమయంలో మొదటి అంతస్తులో కొందరు యువకులు మందు కొట్టి గొడవ చేస్తుండటాన్ని ఆమె గమనించారు. దీంతో వారిపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది. 
 
ఇందుకోసం ఆ గదిలో ఎవరు ఉన్నారో చూద్దామని నెమ్మదిగా తొంగిచూడగా, ఆమె చేతిలోని లంచ్‌బాక్స్ జారి కిందపడిపోయింది. ఈ శబ్దాన్ని విన్న గది లోపలి యువకులు, ఆమెను గట్టిగా పట్టుకుని గదిలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. వారితో పెనుగులాడి, అరుస్తూ, తప్పించుకున్న యువతి, తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. తొలుత ఇద్దరిని అరెస్టు చేశారు. గదిలో ఇంకా చాలామంది ఉన్నారని, వారిని కూడా అరెస్ట్ చేయాలని అపార్ట్‌మెంట్ వాసులు ఆందోళన చేయడంతో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్ననాటి గురువులతో పవన్ కళ్యాణ్ .. చిన్ననాటి ఫోటో చూసి మురిసిపోయాడు...