Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లి పేరిట మోసం.. సహజీవనం.. 21 మందిని అలా చేసేందుకు రెడీ..

పెళ్లి పేరిట మోసం.. సహజీవనం.. 21 మందిని అలా చేసేందుకు రెడీ..
, సోమవారం, 24 డిశెంబరు 2018 (14:05 IST)
దేశ రాజధాని ఢిల్లీలో నిత్య పెళ్లి కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఐదుగురిని పెళ్లి పేరిట మోసం చేశాడు. అక్కడితో ఆగకుండా మరో 21మందిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. హర్యానాకు చెందిన అభిషేక్ వశిష్ట్ అలియాస్ అభినవ్ అభిరుంద్రాంశ్ ఇప్పటి వరకు ఐదుగురు మహిళలను వివాహం చేసుకున్నాడు. 
 
భర్తతో విడిపోయిన మహిళల వివరాలను సేకరించి.. వారితో స్నేహం చేసి.. ఆపై ప్రేమ పేరుతో వలలో వేసుకునే వాడు. చివరికి పెళ్లి చేసుకుని మోసం చేసేవాడు. తానో మీడియా హౌస్ ఓనర్ అని నమ్మించి.. ఈ పని అంతా కానిచ్చాడు. అయితే అభిషేక్ వశిష్ట్‌పై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో కోర్టు అతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 
 
అప్పటి నుంచి నిందితుడు తప్పించుకుని తిరుగుతున్నాడు. మరోవైపు హరిద్వార్‌లో ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారిలో సహజీవనం చేస్తున్నాడు. అంతేకాకుండా మాట్రిమోనియల్ సైట్లలో నకిలీ పేర్లతో పెళ్లి కోసం సంప్రదింపులు జరుపుతున్నాడని విచారణలో తేలింది. ఈ మేరకు నిందితుడిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితుడిని హరిద్వార్‌లో అరెస్ట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇమ్రాన్ ఖాన్ ఇక ఆపండి.. భారత్‌ను చూసి నేర్చుకోండి... ఓవైసీ ఫైర్