Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మత్తు మందుచ్చి వంతులేసుకుని అత్యాచారం.. కారులోనే..?

మత్తు మందుచ్చి వంతులేసుకుని అత్యాచారం.. కారులోనే..?
, మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (10:51 IST)
దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో మహిళపై అఘాయిత్యం చోటుచేసుకుంది. సహ ఉద్యోగినిపై కన్నేసిన ఇద్దరు కామాంధులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. శనివారం సాయంత్రం ఆఫీసు ముగిసిన తర్వాత.. ఇంటికి వెళ్ళేటప్పుడు, సహోద్యోగులు ఇద్దరు కారులో ఎక్కండి.. లిఫ్ట్ ఇస్తామని నమ్మించారు. ఆమె కూడా సహోద్యోగులే కదా అని కారులో ఎక్కింది. 
 
కొద్ది దూరం వెళ్తుండగా యువతికి కూల్ డ్రింక్ ఇచ్చారు. దాన్ని తీసుకున్న తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. ఆపై వారిద్దరూ వంతులేసుకుని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి వసంత్ కుంజ్ ప్రాంతంలో వదిలేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసును నమోదు చేసిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ కేసుపై విచారణను ముమ్మరం చేశామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డోనాల్డ్ ట్రంప్‌ను కోర్టుకీడ్చిన అమెరికా ప్రజలు