Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భర్తను ఇబ్బంది పెట్టాను.. అందుకే నా వెంటే వారిని తీసుకెళ్తున్నాను..

భర్తను ఇబ్బంది పెట్టాను.. అందుకే నా వెంటే వారిని తీసుకెళ్తున్నాను..
, మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (18:39 IST)
భార్యాభర్తల అనుబంధం రాను రాను కనుమరుగవుతోంది. వివాహేతర సంబంధాలు లేకుంటే మనస్పర్థలు సంసారాలను కూలదోస్తున్నాయి. తాజాగా తమిళనాడు, కడలూరులో భర్తతో గొడవకు దిగిన ఓ ఇల్లాలు తన బిడ్డలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. కడలూరుకు చెందిన మదివానన్ (40).. ఫార్మసీ నడుపుతున్నాడు. 
 
ఇతని భార్య శివశంకరి (35). వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు వున్నారు. రెండేళ్ల క్రితం నుంచే భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగేవి. దీంతో మనస్తాపానికి గురైన శివ శంకరి.. తన కుమారులతో పాటు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

భార్యతో గొడవపడి ఫార్మసీకి వెళ్ళి.. రాత్రి ఇంటికొచ్చిన మదివానన్‌కు షాక్ తప్పలేదు. తన ఇంట్లోని ఫ్యానుకు శివశంకరితో పాటు కుమారులిద్దరూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం చూసి షాక్ అయ్యాడు. 
 
కుమారులిద్దరికీ విషం ఇచ్చిన శివశంకరి.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివ శంకరి రాసిన సూసైడ్ నోట్‌ను కనిపెట్టారు. అందులో తన భర్తను తాను ఇబ్బందులకు గురిచేశానని.. ఆయనకు ఇక్కట్లు కలగనీయకుండా వెళ్ళిపోతున్నానని రాసివుంది.

తన కుమారులు ఆయనకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే.. వారిని కూడా తన వెంట తీసుకెళ్తున్నానని శివశంకరి రాసినట్లు వుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్విట్ ఇండియా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్...