Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళనాడులో పూజారులుగా ఎస్సీలు - ఎంబీసీలు : సీఎం స్టాలిన్

తమిళనాడులో పూజారులుగా ఎస్సీలు - ఎంబీసీలు : సీఎం స్టాలిన్
, సోమవారం, 16 ఆగస్టు 2021 (16:44 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఆలయాల్లో పూజలు చేసేందుకు వీలుగా బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమించారు. 
 
ఇప్పటికేవరకు బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన దేవాలయాల్లో అర్చకత్వం ఇప్పుడు బ్రాహ్మణేతరులకు కూడా అనుమతినిస్తూ సీఎం స్టాలిన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
ఇందుకోసం సుశిక్షితులైన 24 మంది బ్రాహ్మణేతరులను పలు పుణ్యక్షేత్రాల్లో అర్చకులుగా నియమించింది. వీరిలో ఐదుగురు షెడ్యూల్ కులాలకు చెందిన వారు కాగా, మరో ఆరుగురు ఎంబీసీలు, 12 మంది బీసీలు, ఓసీ వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నారు. 
 
వీరితో పాటు మరో 138 మందిని ఆలయాల్లో పని చేయడానికి నియమించారు. వీరందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేయబోతున్నారు. గత మే నెలలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన స్టాలిన్ వంద రోజుల పాలనతో అన్ని వర్గాల ప్రజలతో శభాష్ అనిపించుకుంటున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దళితులంటే దరిద్రులు కాదు.. ఉద్యోగులకు కూడా దళిత బంధు: సీఎం కేసీఆర్