Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అదుపు తప్పి లోయలోకి వెళ్లిన బస్సు...తర్వాత ఏమైందంటే

కొండగట్టు బస్సు ప్రమాదం తరహాలోనే కేరళలో కూడా ఒక ప్రమాదం చోటుచేసుకుంది. కానీ అక్కడ 61 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా ఈ సారి అదృష్టవశాత్తూ ఒక జేసీబీ డ్రైవర్ సమయస్ఫూర్తితో 80 మంది ప్రయాణికుల ప్రాణాలు

అదుపు తప్పి లోయలోకి వెళ్లిన బస్సు...తర్వాత ఏమైందంటే
, మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (12:00 IST)
కొండగట్టు బస్సు ప్రమాదం తరహాలోనే కేరళలో కూడా ఒక ప్రమాదం చోటుచేసుకుంది. కానీ అక్కడ 61 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా ఈ సారి అదృష్టవశాత్తూ ఒక జేసీబీ డ్రైవర్ సమయస్ఫూర్తితో 80 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా కాపాడాడు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు చెందిన ఓ బస్సు కేరళలోని రాజక్కాడ్‌కు 80 మంది ప్రయాణికులతో వెళ్తోంది. ఎరచ్చిపార వద్దకు చేరుకోగానే ఆ బస్సు అదుపు తప్పి రోడ్డు కిందకి దూసుకెళ్లింది. బస్సు లోయలోకి పడబోతున్న తరుణంలో అక్కడే పక్కన ఉన్న కపిల్ అనే వ్యక్తి తన జేసీబీని అక్కడికి తీసుకెళ్లాడు. దాన్ని ఆపరేట్ చేస్తూ జేసీబీ హ్యాండిల్‌తో ఆ బస్సును దాదాపు గంటసేపు లోయలోకి పడిపోతుండా నిలిపి పెట్టాడు. 
 
ఈ సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు బస్సులోనుంచి దిగేసి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. తర్వాత బస్సును కూడా ఎంతో శ్రమపడి బయటకు లాగేసాడు. అయితే కపిల్ తన వివరాలను పంచుకోవడానికి ఇష్టపడలేదు. తనతో పాటు వచ్చిన స్నేహితుడు చేసిన ఈ మంచి పని గురించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసాడు. సమయస్ఫూర్తితో 80 మంది ప్రాణాలు కాపాడిన కపిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు కపిల్‌కు ధన్యవాదాలు తెలిపారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేర చరితులపై అనర్హత వేయలేం.. పార్లమెంటే అడ్డుకోవాలి : సుప్రీంకోర్టు