Webdunia - Bharat's app for daily news and videos

Install App

చితికి నిప్పంటించగానే లేచి కూర్చొంది.. ఆస్పత్రికి వెళ్ళగానే చనిపోయింది...

పాముకాటుకు గురైన ఓ యువతి చనిపోయిందని భావించి భౌతికకాయాన్ని కాల్చేందుకు చితికి నిప్పంటించారు. కానీ, ఆ యువతిలో చలనం కనిపించింది. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ తుదిశ్వాస విడిచింది. తాజాగా

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (13:50 IST)
పాముకాటుకు గురైన ఓ యువతి చనిపోయిందని భావించి భౌతికకాయాన్ని కాల్చేందుకు చితికి నిప్పంటించారు. కానీ, ఆ యువతిలో చలనం కనిపించింది. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ తుదిశ్వాస విడిచింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జార్ఖండ్‌ రాష్ట్రంలోని చత్రాకు సమీపంలోని సోఖా ప్రాంతానికి చెందిన అమర్‌ చౌదరి కుమార్తె క్రాంతి కుమారి(16). ఈ యువతి ఆరుబయట నిద్రిస్తుండగా పాము కరిచింది. విష ప్రభావంతో స్పృహ కోల్పోయింది. ఉదయం ఎంతసేపటికీ నిద్రలేవకపోవడంతో కుటుంబ సభ్యులు, చుట్టు పక్కలవారు ఆమెను లేపేందుకు ప్రయత్నించారు. అయితే క్రాంతి కుమారిలో ఎటువంటి చలనం లేకపోవడంతో మృతి చెందిందనే నిర్ధారణకు వచ్చారు. 
 
ఆ తర్వాత కుమారికి కర్మకాండలు నిర్వహించేందుకు ఏర్పాట్లుచేసి మృతదేహాన్ని శ్మశానికి కూడా తీసుకెళ్లారు. భౌతికకాయాన్ని చితిపై పెట్టి... నిప్పు అంటించగానే ఆ యువతి చేతులు కదిలించింది. దీంతో ఆ యువతిని కిందికి దించి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సూచన మేరకు పెద్దాస్పత్రికి తరలిస్తుండగా యువతి కన్నుమూసింది. దీంతో తొలుత సిద్ధం చేసిన చితిపైనే దహన సంస్కారాలు నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

మార్కెట్ మహాలక్ష్మి మూవీ ఎలావుందంటే.. రివ్యూ

నేను ఎవరినైనా మర్డర్ చేసినా ఆయనతో చెప్పేస్తా: సమంతకు అతడే నమ్మకం

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సారంగదరియా- టీజర్‌ను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

అయోధ్య రామమందిరాన్ని సందర్శించిన Mr బచ్చన్ టీం

కాంతారా 2లో మోహన్ లాల్ నటిస్తున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

క్యారెట్ రసం ఎందుకు తాగుతారో తెలుసా?

నువ్వులు, నువ్వుల నూనె ఆరోగ్య ప్రయోజనాలు

వేసవిలో చందన చూర్ణం ఉపయోగాలు

బెస్ట్ సమ్మర్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments