Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్టీసీ బస్ డ్రైవర్ ఎంత పని చేశాడు.. నవ దంపతులను పొట్టనబెట్టుకున్నాడు..

ఆర్టీసీ బస్ డ్రైవర్ ఎంత పని చేశాడు.. నవ దంపతులను పొట్టనబెట్టుకున్నాడు..
, సోమవారం, 19 నవంబరు 2018 (12:32 IST)
ఓ ఆర్టీసీ బస్ డ్రైవర్ సెల్‌ఫోన్ వాడుతూ.. డ్రైవింగ్ చేసిన కారణంగా.. నవదంపతులు ప్రాణాలు కోల్పోయారు. సెల్‌ఫోన్ వాడుతూ బండిని నడిపిన కారణంగా రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళితే.. ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వైపు ఏపీ 29 జడ్ 2157 నెంబర్ గల తెలంగాణ ఆర్టీసీ బస్సు వెళ్తోంది.
 
ఇటీవలే ప్రేమించి వివాహం చేసుకున్న రాజమండ్రికి చెందిన కోటేశ్వర రావు (29), స్వప్న (27) దంపతులు తమ వాహనంపై అదే రూట్లో వస్తున్నారు. కానీ సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ.. బస్సును నడిపిన డ్రైవర్ టీవీ రెడ్డి, బస్సును అదుపు చేయలేక, డివైడర్‌ పైకి ఎక్కించాడు. అది పక్కనే వెళ్తున్న కోటేశ్వరరావు దంపతుల పైకి దూసుకెళ్లింది. 
 
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. లొంగిపోయిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇందిరా గాంధీ బర్త్‌డే.. అత్యంత వివాదాస్పద నిర్ణయం ఎమర్జెన్సీ