Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చలేను. అంతకంటే చావే మేలు...

చదువుల ఒత్తిడిని తట్టుకోలేక మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చలేను. అంతకంటే చావే మేలు అంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టిమరీ ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర సంఘటన గౌహతిలో

తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చలేను. అంతకంటే చావే మేలు...
, శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (09:06 IST)
చదువుల ఒత్తిడిని తట్టుకోలేక మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చలేను. అంతకంటే చావే మేలు అంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టిమరీ ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర సంఘటన గౌహతిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఐఐటీ గౌహతిలో కర్నాటకకు చెందిన నాగశ్రీ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో చేరింది. హాస్టల్‌లో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో బుధవారం హాస్టల్‌ గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌‌కు ఉరి వేసుకొంది. ఈ విషయాన్ని సెక్యూరిటీ గార్డులు గమనించి.. పోలీసులకు సమాచారం చేరవేశారు. 
 
వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు... తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి మృతదేహాన్ని కిందికి దించారు. ఆమె బెడ్‌పై ఓ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. 'తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చలేను. అంతకంటే చావే మేలు' అంటూ అందులో పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోతులను చంపడంతోనే కొండగట్టు ఆంజనేయుడికి కోపమా... అందుకే ప్రమాదం జరిగిందా?