Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీకి రూ.250 కోట్లు... బీఆర్ఎస్‌కు రూ.90 కోట్ల విరాళాలు..

bjp flags

ఠాగూర్

, గురువారం, 4 జనవరి 2024 (14:03 IST)
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి విరాళాలు కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి. గత పదేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. దీంతో పార్టీకి విరాళాలు ఇచ్చేందుకు పారిశ్రామికవేత్తలు పోటీ పడుతున్నారు. ఫలితంగా గత 2022-23 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీకి ఏకంగా రూ.250 కోట్ల మేరకు విరాళాలు వచ్చాయి. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో 70 శాతం విరాళాలు కాషాయం పార్టీ ఖాతాల్లోకి చేరడం గమనార్హం. 
 
ఇకపోతే, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి పార్టీకి రూ.90 కోట్ల విరాళాలు వచ్చాయి. ఏడీఆర్ నివేదిక ప్రకారం బీజేపీ తర్వాత అత్యధిక విరాళాలు అందుకున్న పార్టీల్లో భారాస రెండో స్థానంలో ఉంది. అలాగే, ఏపీలోని మరో అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రూ.17.40 కోట్లు వచ్చాయి. 
 
2022-23లో మొత్తం రూ.363 కోట్లకు పైగా విరాళాల రూపంలో రాజకీయ పార్టీలకు అందాయని ఎలక్ట్రోరల్ ట్రస్టుల నివేదికలు వెల్లడిస్తున్నాయి. 39 కార్పొరేట్, బిజినెస్ హౌస్‌ల నుంచి ఈ విరాళాలు అందినట్టు పేర్కొంది. 34 కార్పొరేట్, వ్యాపార సంస్థలు ఫ్రూడెంట్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్‌కు రూ.360 కోట్లు, సమాజ్ ఎలక్టోరల్ ట్రస్ట్‌కు ఒక కంపెనీ నుంచి రూ.2 కోట్లు, పరిబర్తన్ ఎలక్టోరల్ ట్రస్ట్‌‍కు 2 కంపెనీలు రూ.75.50 లక్షలు, ట్రింప్ ఎలక్టోరల్ ట్రస్ట్‌కు 2 కంపెనీలు రూ.50 లక్షలు విరాళంగా అందించాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామాలయంతో పాటు సీఎం ఆదిత్యనాథ్‌ను చంపేస్తాం...