Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మో.. ఆమె కడుపులో 15 కిలోల కణితి.. పేలిపోయే స్థితిలో..?

Doctors
, బుధవారం, 9 ఆగస్టు 2023 (22:37 IST)
Doctors
మధ్యప్రదేశ్‌లోని అష్టా ప్రాంతానికి చెందిన ఓ మహిళ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. ఆ తర్వాత ఇండోర్‌లోని ఇండెక్స్‌ అనే ఆసుపత్రిని ఆ మహిళ ఆశ్రయించి కడుపు నొప్పి గురించి వైద్యులకు చెప్పింది. 
 
మహిళ పొత్తికడుపు బాగా వాచి ఉండడంతో వైద్యులు మహిళకు స్కానింగ్‌తో సహా పరీక్షలు నిర్వహించి గర్భాశయంలో కణితిని గుర్తించారు. అలాగే కణితి పేలిపోయే స్థితిలో ఉండడంతో వెంటనే ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. 
 
తదనంతరం, మహిళ మరియు ఆమె కుటుంబ సభ్యుల సమ్మతితో, సుమారు 12 మంది వైద్యులు, సహాయక సిబ్బంది బృందం రెండు గంటలపాటు శస్త్రచికిత్స చేసింది. అనంతరం శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తికావడంతో వైద్యులు మహిళ కడుపులోని 15 కిలోల కణితిని తొలగించారు. 
 
శస్త్ర చికిత్స బృందానికి చెందిన డాక్టర్ అతుల్ వ్యాస్ మాట్లాడుతూ.. మహిళ బరువు 49 కిలోలు.. ఆమె లోపల 15 కిలోల బరువున్న కణితిని మోస్తున్నారని, కణితి భారీగా ఉండటంతో రోగికి ఆహారం, నడవడానికి ఇబ్బందిగా ఉన్నదని తెలిపారు. అందుకే వెంటనే సర్జరీ చేశామని.. సర్జరీ సమయంలో టీమ్ చాలా జాగ్రత్తగా వ్యవహరించింది.
 
ఎందుకంటే సర్జరీ సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే అది ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ట్యూమర్ చాలా నరాలకు అతుక్కొని ఉండడంతో డాక్టర్లు సున్నితంగా వ్యవహరించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి బాగానే వుందని చెప్పారు. 
 
అలాగే, హాస్పిటల్ ప్రెసిడెంట్ సురేష్ సింగ్ భటురియా, వైస్ ప్రెసిడెంట్ మయాంక్‌రాజ్ సింగ్ భతురియా వైద్యుల పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెడ్‌మి నోట్ 13 సిరీస్- అక్టోబర్ నాటికి చైనా మార్కెట్లోకి..