Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరకట్నం కోసం పెళ్లి ఆపేసిన తల్లిదండ్రులు.. పోలీసులు ఏం చేశారో తెలుసా?

వరకట్నం కోసం పెళ్లి ఆపేసిన తల్లిదండ్రులు.. పోలీసులు ఏం చేశారో తెలుసా?
, మంగళవారం, 13 నవంబరు 2018 (13:57 IST)
వరకట్నం కోసం అమ్మాయి తరపు వారిని వేధిస్తూ.. తన పెళ్లికి ఆటంకం కలిగిస్తున్నారని ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు తమ సొంత ఖర్చుతో ఆ యువకుడి వివాహం జరిపించిన ఘటన తమిళనాడు ఈరోడ్డులో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే... తమిళనాడు, ఈరోడ్డు జిల్లా తాళవాడి ప్రాంతానికి చెందిన రాజన్న (21)కు కర్ణాటక, సామ్రాజ్ నగర్ తాలూకా, జ్యోతికవుడనపురం ప్రాంతానికి చెందిన అంబికా (25) అనే అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. 
 
వీరిద్దరి వివాహం నవంబర్ ఐదో తేదీన జరుగుతుందని నిశ్చయించారు. అయితే వరకట్నం కోసం రాజన్న తల్లిదండ్రులు అంబికా తరపు వారిని వేధించడం మొదలెట్టారు. అయితే అంబికా తల్లిదండ్రులు వారి కోరిన మొత్తాన్ని ఇవ్వలేమని చెప్పడం రాజన్న- అంబికాల వివాహం ఆగిపోయింది.

ఇంతలోనే రాజన్న-అంబికాల మధ్య ప్రేమ చిగురించింది. వరకట్నం వద్దని రాజన్న అతడి తల్లిదండ్రులకు ఎంత చెప్పినా.. వారు వరకట్నం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో.. వేరు దారిలేక బెంగళూరు సామ్రాజ్ నగర్ పోలీసులకు రాజన్న తన తల్లిదండ్రులపైనే ఫిర్యాదు చేశాడు. 
 
ఈ ఫిర్యాదు మేరకు సామ్రాజ్ నగర్ పోలీసులు ఇరు కుటుంబీకులకు చెందిన పెద్దలను పిలిపించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ రాజన్న కుటుంబీకులు వరకట్నం కోసం పోలీసుల ముందే పట్టుబట్టారు.

దీంతో పోలీసులే రాజన్న తల్లిదండ్రులకు వారడిగిన రెండు లక్షల కట్నం ఇచ్చి అంబికతో రాజన్న పెళ్లిని నవంబర్ 10వ తేదీన పోలీస్ స్టేషన్‌లోనే జరిపించారు. ఈ ఘటనతో పోలీసులను స్థానికులు అభినందించారు. అంతేగాకుండా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పోలీసులను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాజ‌ల్‌కి ముద్దు పెట్టిన ఛోటా కె నాయుడు మైండ్ దొ....దా?(Video)