Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏ ఒక్కరూ యూట్యూబ్ చానెల్ నిర్వహించరాదు.. కేరళ సర్కారు ఉత్తర్వులు

youtube
, సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (08:37 IST)
కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ కూడా యూట్యూబ్ చానెల్ నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీచేసింది. యూట్యూబ్ చానెల్ కలిగివున్న ఉద్యోగులు తక్షణం తమ చానెల్‌ను మూసివేయాలని ఆదేశించింది. 
 
స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా ప్రస్తుతం అతి సామాన్యులు సైతం వారి ప్రతిభకు అనుగుణంగా యూట్యూబ్‌ ఛానల్స్‌ విజయవంతంగా నడుపుతున్న విషయం తెలిసిందే. కొందరు ఉద్యోగులు సైతం ఇదే బాట పట్టి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకొంటున్నారు. 
 
వంటలు, కామెడీ కార్యక్రమాల వీడియోలు అప్‌లోడ్‌ చేసి రూ.లక్షల్లో సంపాదిస్తున్నవారూ ఉన్నారు. ఈ అదనపు ఆదాయ మార్గంపై వేటు వేస్తూ.. ప్రభుత్వ ఉద్యోగం చేసే ఏ ఒక్కరూ ఇకపై యూట్యూబ్‌ ఛానల్స్‌ను నిర్వహించవద్దంటూ కేరళ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు అలా చేయడం.. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని జీవోలో పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్న ప్రేమజంట.. ఎక్కడ?