Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లోక్‌సభ ఎన్నికలు-2024: ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం

polling

సెల్వి

, శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (07:39 IST)
లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
 
ఇందులో భాగంగా  తమిళనాడు (39), అరుణాచల్ ప్రదేశ్ (2), మేఘాలయ (2), రాజస్థాన్ (12), ఉత్తరప్రదేశ్ (8), మధ్యప్రదేశ్ (6), ఉత్తరాఖండ్ (5) రాష్ట్రాల్లోని అన్ని స్థానాలకు తొలి దశలో భాగంగా శుక్రవారం ఎన్నికలు జరుగుతున్నాయి. 
 
ఇంకా అండమాన్-నికోబార్ దీవులు (1), మిజోరం (1), నాగాలాండ్ (1), పుదుచ్చేరి (1), సిక్కిం (1), లక్షద్వీప్ (1).. అసోం, మహారాష్ట్రలో 5, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, మణిపూర్‌లో 2, త్రిపుర, జమ్మూకశ్మీర్, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కో సీటుకు నేడు పోలింగ్ జరుగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ లీడర్‌గా రాహుల్ ఉండేవరకు బీజేపీకి ఇబ్బంది లేదు.. కిషన్ రెడ్డి