Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మొన్న మూత్రం పోశారు.. ఇపుడు పాదాలు నాకించారు.. ఎంపీలో అమానవీయ ఘటనలు

mp man
, ఆదివారం, 9 జులై 2023 (11:27 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పాలనలో అమానవీయ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికిమొన్న ఓ గిరిజన తెగకు చెందిన వ్యక్తితో బీజేపీ ప్రతినిధి ఒకరు మూత్ర విసర్జనకు పాల్పడ్డారు. ఈ ఘటన మరువక ముందే జరిగిన మరో ఘటన ప్రభుత్వంపై విమర్శలకు కారణమవుతోంది. 
 
ఓ యువకుడిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లిన వ్యక్తులు అందులోనే అతడితో 17 ఏళ్ల కుర్రాడి పాదాలు నాకించి వికృత చేష్టలకు దిగారు. అంతకుముందు చెప్పులతో చితకబాదారు. కారులోనే ఉన్న మరో వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ అయింది.
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. బాధితుడు, నిందితులు గ్వాలియర్ జిల్లాలోని డబరా ప్రాంతానికి చెందిన యువకుడిగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సికింద్రాబాద్ పాలికా బజార్‌లో భారీ అగ్నిప్రమాదం