Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని భార్యను కడతేర్చాడు..

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని భార్యనే కడతేర్చాడో కసాయి భర్త. ఈ ఘటన హిందూపురం పట్టణంలో చోటుచేసుకుంది. హిందూపురం పట్టణం స్టేట్‌బ్యాంక్‌ సమీపంలో ఉంటున్న బాలవినయ్‌కు బెంగళూరులోని మేనత్త కుమార్తె దీపిక(

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని భార్యను కడతేర్చాడు..
, గురువారం, 30 ఆగస్టు 2018 (13:24 IST)
ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని భార్యనే కడతేర్చాడో కసాయి భర్త. ఈ ఘటన హిందూపురం పట్టణంలో చోటుచేసుకుంది. హిందూపురం పట్టణం స్టేట్‌బ్యాంక్‌ సమీపంలో ఉంటున్న బాలవినయ్‌కు బెంగళూరులోని మేనత్త కుమార్తె దీపిక(31)తో పదేళ్ల కిందట వివాహమైంది. రెండేళ్లు కాపురం చేశాక విభేదాలు రావటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
ఆరేళ్ల కుమారుడు హరిచరణ్ ఆమె వద్దే వుంటున్నాడు. అనంతరం బాలవినయ్ మరో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య దీపిక తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని హిందూపురంలో కోర్టుకెక్కింది. ఈ నెల 27న విచారణ సందర్భంగా ఆమె హిందూపురానికి కుమారుడితోపాటు వచ్చింది. కేసు చివరిదశకు రావటం, ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని తెలుసుకున్న బాలవినయ్‌ ఆమెను ఇంటికి పిలిపించుకొని దాడికి పాల్పడ్డాడు.
 
అనంతరం పోలేపల్లి వద్ద చంపి పొలాల్లో కాల్చేశాడు. హరిచరణ్‌ను బెంగళూరులోని అమ్మమ్మ వద్ద వదిలేసి వచ్చి.. భార్యను చంపేశాడు. ఈ ఘటనపై దీపిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులో వచ్చింది. బాలవినయ్ ప్రస్తుతం పరారీలో వున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెల్లికి మద్యం తాగించి పదేళ్ల బాలికపై అన్న అత్యాచారం