Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని భార్యను కడతేర్చాడు..

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని భార్యనే కడతేర్చాడో కసాయి భర్త. ఈ ఘటన హిందూపురం పట్టణంలో చోటుచేసుకుంది. హిందూపురం పట్టణం స్టేట్‌బ్యాంక్‌ సమీపంలో ఉంటున్న బాలవినయ్‌కు బెంగళూరులోని మేనత్త కుమార్తె దీపిక(

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (13:24 IST)
ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని భార్యనే కడతేర్చాడో కసాయి భర్త. ఈ ఘటన హిందూపురం పట్టణంలో చోటుచేసుకుంది. హిందూపురం పట్టణం స్టేట్‌బ్యాంక్‌ సమీపంలో ఉంటున్న బాలవినయ్‌కు బెంగళూరులోని మేనత్త కుమార్తె దీపిక(31)తో పదేళ్ల కిందట వివాహమైంది. రెండేళ్లు కాపురం చేశాక విభేదాలు రావటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
ఆరేళ్ల కుమారుడు హరిచరణ్ ఆమె వద్దే వుంటున్నాడు. అనంతరం బాలవినయ్ మరో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య దీపిక తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని హిందూపురంలో కోర్టుకెక్కింది. ఈ నెల 27న విచారణ సందర్భంగా ఆమె హిందూపురానికి కుమారుడితోపాటు వచ్చింది. కేసు చివరిదశకు రావటం, ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని తెలుసుకున్న బాలవినయ్‌ ఆమెను ఇంటికి పిలిపించుకొని దాడికి పాల్పడ్డాడు.
 
అనంతరం పోలేపల్లి వద్ద చంపి పొలాల్లో కాల్చేశాడు. హరిచరణ్‌ను బెంగళూరులోని అమ్మమ్మ వద్ద వదిలేసి వచ్చి.. భార్యను చంపేశాడు. ఈ ఘటనపై దీపిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులో వచ్చింది. బాలవినయ్ ప్రస్తుతం పరారీలో వున్నాడు.

సంబంధిత వార్తలు

గుంటూరు కారం మెట్టు దిగింది.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్‌తో శ్రీలీల

నా సినిమాల గురించి నికోలయ్ నిర్మొహమాటంగా చెబుతారు : శబరి నటి వరలక్ష్మీ శరత్ కుమార్

ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్‌రాజు ప్రొడక్షన్స్ లవ్ మీ- ఇఫ్ యు డేర్

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

పృథ్వీ హీరోగా, రూపాలి, అంబిక హీరోయిన్లుగా చిత్రం ప్రారంభం

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలో మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ వినూత్నమైన మత్తు విధానం

డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?

రాత్రులు చాక్లెట్లు, ఐస్ క్రీమ్‌లు తింటున్నారా.. ఐతే అదే కారణం?

తర్వాతి కథనం
Show comments