Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యేడాది క్రితం వివాహం.. 3 నెలల క్రితం పుట్టిన కుమార్తెను చూడకుండానే...

యేడాది క్రితం వివాహం.. 3 నెలల క్రితం పుట్టిన కుమార్తెను చూడకుండానే...
, శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (14:18 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పూల్వామాలో సీఆర్పీఎఫ్ వాహనశ్రేణిపై జరిగిన దాడిలో చనిపోయిన జవాన్ల సంఖ్య 49కు చేరింది. వీరిలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రోహితాష్ లాంబా అనే జవాను కూడా ఉన్నాడు. ఈ జవానుకు సరిగ్గా ఒక యేడాది క్రితం పెళ్లి జరుగగా, మూడు నెలల క్రితం పాప పుట్టింది. ఈ పాపను ఒక్కసారి కూడా లాంబా చూడలేదు. ఈ ఈ నెలాఖరులో ఇంటికి వెళ్ళేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలోనే ఉగ్రమూకల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. 
 
దీనిపై లాంబా స్నేహితుడు ఒకరు మాట్లాడుతూ, కుమార్తెను చూసేందుకు రోహితాష్ హోలీ పండుగకు రావాల్సివుంది. అయితే ఇంతలోనే అతను ఉగ్రదాడికి బలయ్యాడు. అతని మరణవార్త విన్నాక అతని ఇంటిలోనేకాకుండా గ్రామమంతటా విషాదం నెలకొంది. అతని ఇంట్లో పరిస్థితులన్నీ సవ్యంగా ఉన్న సమయంలో శ్రీనగర్ నుంచి వచ్చిన ఫోను రోహితాష్ ఇంట్లో విషాదాన్ని నింపేసిందన్నారు. సీఆర్‌పీఎఫ్ మేజర్ ఫోనులో ఈ విషయాన్ని రోహితాష్ కుటుంబ సభ్యులకు తెలియజేశారన్నారు. రోహితాష్ మరణవార్త వినగానే అతని సోదరుడు జితేంద్ర కుప్పకూలిపోయాడనీ, ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో పట్టాలపైకి తొలి ఇంజిన్ రహిత ఎక్స్‌ప్రెస్ రైలు