Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మూడేళ్ల బాలుడి కళ్ల ముందే తల్లి ఆత్మహత్య.. చూస్తూ ఏడుస్తూ..

మూడేళ్ల బాలుడి కళ్ల ముందే తల్లి ఆత్మహత్య.. చూస్తూ ఏడుస్తూ..
, బుధవారం, 5 డిశెంబరు 2018 (18:54 IST)
పూణేలో ఘోరం జరిగింది. కంటిముందే తల్లి ఆత్మహత్యకు పాల్పడుతుంటే.. ఏం జరుగుతుందో తెలియని స్థితిలో మూడేళ్ల బాలుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. గత 2012వ సంవత్సరం స్వరూప్ శ్రీకార్ అనే వ్యక్తిని స్నేహ పెళ్లాడింది. 
 
వివాహానికి తర్వాత అత్తగారితో విబేధాలు తలెత్తాయి. ఈ విషయమై భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు చోటుచేసుకున్నాయి. స్నేహను స్వరూప్‌తో పాటు అతని తల్లి కారు కోసం పుట్టింటి నుంచి డబ్బు తేవాలని వేధించేవారు. 
 
దీంతో మనస్తాపానికి గురైన స్నేహా.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో తన మూడేళ్ల కుమారుడి కళ్లముందే ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని చూసిన ఆ చిన్నారి ఏం చేయాలో తోచక ఏడుస్తూ కనిపించాడు. 
 
దీన్ని గమనించిన స్థానికులు స్నేహను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. దీనిపై స్నేహ కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంకా స్నేహ భర్త స్వరూప్, స్వరూప్ తల్లి పద్మ శ్రీసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో ఎన్నికల ఊరేగింపులకు నో... 7వ తేదీ పోలింగ్...