Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రావణ దహనంలో పెను విషాదం... రైలు ఢీకొట్టి 50 మందికి పైగా దుర్మరణం(Video)

రావణ దహనంలో పెను విషాదం... రైలు ఢీకొట్టి 50 మందికి పైగా దుర్మరణం(Video)
, శుక్రవారం, 19 అక్టోబరు 2018 (21:09 IST)
పంజాబ్‌లోని జోడా పాటక్ ప్రాంతంలో దసరా ఉత్సవాలలో చేసే రావణ దహనం సందర్భంగా పెను విషాదం చోటుచేసుకుంది. దసరా చివరి రోజు కావడంతో రావణ దహనం ఏర్పాటు చేయగా... దాన్ని వీక్షిస్తున్న వారిని అత్యంత వేగంగా దూసుకొచ్చిన హవ్డా ఎక్స్‌ప్రెస్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా అక్కడికక్కడే మృతి చెందారు. రైలు ధాటికి శవాలు ఎగిరి చెల్లాచెదురుగా పడిపోయాయి.
 
రావణ దహనం రైలు ట్రాక్ పక్కనే కావడంతో అంతా ఆ వేడుకను చూసేందుకు ట్రాక్ వద్ద గుమిగూడారు. ఆ సమయంలో 700 మందికి పైగా వున్నట్లు తెలుస్తోంది. రావణ దహనం తాలూకు వచ్చే టపాసుల భారీ పేలుడు శబ్దంతో తాము నిల్చున్న రైల్వే ట్రాక్ పైన వేగంగా దూసుకు వస్తున్న రైలును గమనించలేకపోయారు. దాంతో ఈ ఘోరం జరిగిపోయింది. 
 
ప్రాధమిక సమాచారాన్ని బట్టి 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు చెపుతున్నా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌ను మించిన రాక్షసుడు లేడు.... మంత్రి పరిటాల సునీత ఘాటు వ్యాఖ్యలు...