Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుల్లెట్ రైల్ టిక్కెట్ ధర ఎంత? ఏయే స్టేషన్లలో ఆగుతుంది?

దేశంలో వచ్చే 2022 ఆగస్టు 15వ తేదీ నుంచి బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలుత అమ్మదాబాద్ - ముంబైల మధ్య తొలి బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం గురువారం భూమి పూ

బుల్లెట్ రైల్ టిక్కెట్ ధర ఎంత? ఏయే స్టేషన్లలో ఆగుతుంది?
, గురువారం, 14 సెప్టెంబరు 2017 (12:31 IST)
దేశంలో వచ్చే 2022 ఆగస్టు 15వ తేదీ నుంచి బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలుత అమ్మదాబాద్ - ముంబైల మధ్య తొలి బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం గురువారం భూమి పూజ చేయడం జరిగింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షింజో అబేలు పాల్గొన్నారు.
 
కాగా, అహ్మదాబాద్‌లోని సబర్మతి రైల్వే స్టేషన్ - ముంబైలోని బాంద్రా కుర్లా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రాజెక్టును చేపడుతారు. మొత్తం 508 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రైలు మార్గాన్ని 27 కిలోమీటర్ల సొరంగ మార్గంలోనూ, 12 కిలోమీటర్లు వంతెనలపైనా, మరో 468 కిలోమీటర్లు భూమిపై నిర్మించనున్నారు. 
 
ఈ మార్గంలో బుల్లెట్ రైలు నాలుగు రైల్వే స్టేషన్లలో ఆగి వెళితే ప్రయాణ సమయం 2 గంటల 7 నిమిషాల సమయం పడుతుంది. కానీ, మొత్తం 12 స్టేషన్లలో ఆగి వెళ్లేలా ప్రతిపాదనలు చేస్తోంది. ఇందులో బాంద్రా కుర్లా, థానే, విరార్, బోయిసర్, వప్లే, బిల్‌మోరా, సూరత్, బహ్రుచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి స్టేషనలో ఆగి వెళ్లేలా ప్రతిపాదిస్తున్నారు. ఇలా 12 స్టేషన్లలో ఆగి వెళితే మాత్రం ప్రయాణ సమయం 2 గంటల 58 నిమిషాల సమయం పడుతుంది. 
 
అలాగే, బుల్లెట్ రైలులో ప్రయాణ టిక్కెట్ ధర ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా... రూ.2700 నుంచి రూ.3000లోపు ఉండనుంది. కానీ, ఈ మార్గంలో విమాన టిక్కెట్ ధర రూ.3500 నుంచి రూ.4000 వరకు ఉండగా, లగ్జరీ బస్సులో రూ.1500 నుంచి రూ.2000 వరకు ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుల్లెట్ రైలు వస్తే విమానాల్లో ఎవరూ ప్రయాణించరు: నరేంద్ర మోడీ