Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇద్దరిని ప్రేమించింది.. ఇద్దరినీ పెళ్లి చేసుకోవాలనుకుంది.. చివరికి?

ఇద్దరిని ప్రేమించింది.. ఇద్దరినీ పెళ్లి చేసుకోవాలనుకుంది.. చివరికి?
, గురువారం, 25 అక్టోబరు 2018 (10:03 IST)
స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా ప్రభావంతో మానవీయ విలువలు గంగలో కలిసిపోతున్నాయి. భార్యాభర్తల అనుబంధానికి గౌరవం దక్కట్లేదు. అలాగే ప్రేమలో నిజాయితీ సన్నగిల్లుతోంది. అంతేగాకుండా వివాహేతర సంబంధాలు, సహజీవనాలు పెరిగిపోతున్నాయి. దీనికితోడు నేరాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా ఒకేసారి ఇద్దరు యువకులతో ప్రేమాయణం సాగించిన ఓ యువతి.. మరొకరి సాయంతో ప్రియుడిని హత్య చేసింది. 
 
వివరాల్లోకి వెళితే... ముంబై ఫరూక్‌ నగర్‌ మండలం గుండుగేరికి చెందిన ఈరమోని శేఖర్‌ (24), పర్వీన్‌ బేగం (18) మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. 8 నెలల క్రితం గుండుగేరికి ఉపాధి నిమిత్తం వచ్చిన తోళ్ల వ్యాపారి మహమ్మద్‌ ఆసిఫ్‌ ఖురేషీ (23)తో పర్వీన్‌కు పరిచయం కాగా, అతన్ని కూడా ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని భావించిన సమయంలో, శేఖర్ విషయం ఆసిఫ్‌కు తెలిసింది. 
 
ఈ విషయంలో పర్వీన్‌ను నిలదీశాడు. శేఖర్ తన వద్ద రూ. 4,500 అప్పు తీసుకున్నాడని, దాన్ని ఇవ్వకుండా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆసిఫ్‌పై శేఖర్‌కు అబద్ధాలు చెప్పింది. ఆమె మాటలు నమ్మిన ఆసిఫ్‌ను చంపేందుకు శేఖర్ పర్వీన్‌కు సాయం చేశాడు. ఈ క్రమంలో 19వ తేదీ రాత్రి శేఖర్‌ను తన ఇంటికి రప్పించిన పర్వీన్, మద్యంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది.
 
శేఖర్ మత్తులోకి జారుకోగానే, ప్రియుడి సాయంతో గొంతుకోసి చంపేసింది. ఇలా హత్య చేసి ముంబై పారిపోతూ షాద్ నగర్ పోలీసులకు పట్టుబడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బరాక్ ఒబామా - హిల్లరీ క్లింటన్‌ హత్యకు కుట్ర... నివాసాలకు భారీగా పేలుడు పార్శిల్స్