Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రజలంతా జంతువులే.. ఆ ఇద్దరు మాత్రం జంతువేతరులు: రాహుల్

విపక్షాలను కుక్కలు, పిల్లులు, పాములతో పోల్చుతూ బీజేపీ జాతీయాధ్యక్షుడు చేసిన కామెంట్లపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత దేశంలో ఉన్న ప్రజలంతా జంతువ

ప్రజలంతా జంతువులే.. ఆ ఇద్దరు మాత్రం జంతువేతరులు: రాహుల్
, ఆదివారం, 8 ఏప్రియల్ 2018 (14:04 IST)
విపక్షాలను కుక్కలు, పిల్లులు, పాములతో పోల్చుతూ బీజేపీ జాతీయాధ్యక్షుడు చేసిన కామెంట్లపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత దేశంలో ఉన్న ప్రజలంతా జంతువులేనని.. కేవలం రెండే రెండు జంతువేతరులున్నారని.. వారెవరో తెలుసా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలని ఎద్దేవా చేశారు. 
 
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కోలార్‌ పరిసరాల్లో ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ.. ఓ సభలో మాట్లాడుతూ.. బీజేపీ నేతలను దెప్పిపొడిచారు. తదుపరి ఎన్నికల్లో తమ ప్రభుత్వం ఉండదని అర్థం చేసుకున్న మోదీ, మానసికంగా కుంగిపోయారని, అందుకే ఇలాంటి అగౌరవ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. 
 
దేశంలోని దళితులు, మైనారిటీలు సహా తమ పార్టీ నేతలను కూడా వారు పనికిరాని వారుగా చూస్తున్నారని రాహుల్ నిప్పులు చెరిగారు. ఆర్థికంగా దేశాన్ని సర్వనాశనం చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని, బ్యాంకుల కుంభకోణాలు పెరిగిపోయానని, నోట్ల రద్దుతో ప్రజలను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్యాచారం జరిగిందని అబద్ధం చెప్తారా? శరీరంపై గాయాలు లేకపోతే?