Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తీవ్రవాదుల అంతానికి పాకిస్థాన్‌లో సైతం ప్రవేశిస్తాం : రాజ్‌నాథ్ సింగ్

rajnath singh

ఠాగూర్

, శనివారం, 6 ఏప్రియల్ 2024 (10:04 IST)
తమ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి సరిహద్దులను దాటి పారిపోయేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, అవసరమైతే పాకిస్థాన్‌లో సైతం ప్రవేశిస్తామని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు పారిపోయినా వారిని ఏరివేసేందుకు ఆ దేశంలోకి ప్రవేశిస్తామని తెలిపారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగించాలని భారత్ ఎల్లప్పుడూ కోరుకుంటుందని అన్నారు. అయితే పదే పదే కవ్విస్తూ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తే మాత్రం విడిచిపెట్టే ప్రసక్తేలేదని ఆయన హెచ్చరించారు. 
 
విస్తృత ప్రణాళికలో భాగంగా విదేశీ గడ్డపై ఉగ్రవాదులను భారత్ ఏరివేస్తోందని, 2020 నుంచి పాకిస్థాన్ దేశంలో 20 మందిని మట్టుబెట్టిందంటూ బ్రిటన్‌కు చెందిన 'గార్డియన్' పత్రిక ఓ కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ కథనంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించలేదు. పాకిస్థాన్ విదేశాంగ శాఖ కూడా స్పందించేందుకు నిరాకరించింది. కాగా 2019లో జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి బాంబు దాడి తర్వాత భారత్, పాక్ సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.
 
కెనడా, అమెరికాలోని ఖలిస్థానీ టెర్రిరిస్టులను భారత్ చంపేస్తోందని, అంతమొందించడానికి ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు వచ్చిన కొన్ని నెలల తర్వాత గార్డియన్ పత్రికలో ఈ కథనం వెలువడింది. ఈ యేడాది ఆరంభంలో తమ భూభాగంపై ఇద్దరు పౌరుల హత్యలో భారత ఏజెంట్లకు సంబంధం ఉందని పాకిస్థాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. అయితే పాక్ చేసిన ఈ ప్రకటనను భారత్ ఖండించింది. ఇది తప్పుడు ప్రచారమని తిప్పికొట్టింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు ఎన్ని అన్యాయాలు చేసినా పవన్ కళ్యాణ్‌కు దేవుడే : పోసాని కృష్ణ మురళి