Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శబరిమలైలో అయ్యప్ప భక్తులపై పోలీసుల లాఠీచార్జ్

sabarimala devotees
, మంగళవారం, 19 డిశెంబరు 2023 (14:13 IST)
శబరిమలైలో అయ్యప్ప భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. గత కొన్ని రోజులుగా శబరిమల పుణ్యక్షేత్రంలో అయ్యప్ప భక్తులతో విపరీతమైన రద్దీ నెలకొనివున్న విషయం తెల్సిందే. భక్తులకు తగినవిధంగా ట్రావెన్‌కోర్ ఆలయ అధికారులు తగిన సౌకర్యాలు కూడా కల్పించలేదు. దీంతో భక్తుల అన్ని విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కూడా శబరిమల మార్గం మధ్యలో అయ్యప్ప స్వాములను నిలిపివేశారు. తాళ్లను కుట్టి భక్తులను గంటల కొద్దీ నిలువుకాళ్లపై నిలబెట్టారు. దీంతో విసిగిపోయిన అధికారులు... చిన్నపిల్లలు, వృద్దులు కూడా ఉన్నారని, ఎంతసేపు నిలబెడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు, అయ్యప్ప భక్తుల మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహించిన పోలీసులు అయ్యప్ప భక్తులపై లాఠీచార్జ్ చేశారు. 
 
మరోవైపు, శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. భక్తుల రద్దీతో శబరిగిరులు కిటకిటలాడుతున్నాయి. పంబ నది నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో రద్దీగా మారింది. దీంతో అధికారులు అయ్యప్ప భక్తులను మధ్యలో నిలిపేశారు. రద్దీని నియంత్రించేందుకు ఈవిధంగా చర్యలు తీసుకోవల్సి వస్తుందని అధికారులు అంటున్నారు. భక్తులను నియంత్రించే క్రమంలో వారిపై పోలీసులు లాఠఛార్జ్ కూడా చేస్తున్నారు. దీంతో అయ్యప్ప భక్తులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగళూరు ఎయిర్ పోర్టు రోడ్డులో సడెన్ బ్రేక్.. తొమ్మిది కార్లు ధ్వంసం