Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెన్నై రైల్వే స్టేషన్‌లో విద్యార్థినిపై అత్యాచారం యత్నం.. ప్రియుడుని బయటకు పంపించి...

చెన్నై రైల్వే స్టేషన్‌లో విద్యార్థినిపై అత్యాచారం యత్నం.. ప్రియుడుని బయటకు పంపించి...
, సోమవారం, 7 జనవరి 2019 (14:34 IST)
చెన్నై నగరంలోని ఎంఆర్టీఎస్ రైల్వే స్టేషన్‌లో కేరళ రాష్ట్రానికి చెందిన ఓ డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘాతుకానికి పాల్పడింది కూడా ఆ స్టేషన్‌లోని బుక్కింగ్ కౌంటర్ క్లర్క్, లిఫ్టు ఆపరేటర్లు కావడం గమనార్హం. ఆ విద్యార్థిని ప్రియుడిని బలవంతంగా స్టేషన్ బయటకు పంపించి... యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కేరళకు చెందిన ఓ యువతి చెన్నైలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆమెకు నగరానికి చెందిన ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ సాయంత్రం వేళల్లో స్థానిక తరమణిలోని ఎంఆర్ఎటీఎస్ రైల్వే స్టేషన్‌లో రాత్రి 10.30 గంటల వరకు కూర్చొని మాట్లాడుకునేవారు. ఈ తంతు గత కొన్ని రోజులుగా సాగుతోంది. 
 
వీరిద్దరినీ టిక్కెట్ బుకింగ్ క్లర్క్ లోకేశ్వరన్ (22), లిఫ్టు ఆపరేటర్లు లూకాస్, శ్రీరామ్‌లు గత కొన్ని రోజులుగా గమనిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు పెద్దగా లేరు. ఆ సమయంలో ప్రేమికులిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అపుడు లోకేశ్వరన్, లూకాస్, శ్రీరామ్‌లు వారివద్దకు వచ్చి రాత్రి 10.30 గంటల వరకు ఇక్కడ ఏం పని అంటూ నిలదీశారు.
 
ఆ తర్వాత యువకుడిని బలవంతంగా బయటకు పంపించి, విచారణ పేరుతో యువతిని రైల్వే స్టేషన్ మొదటి అంతస్తులోకి తీసుకెళ్లి రూ.5 వేలు అపరాధం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంత మొత్తం తన వద్ద లేదని ఆ యువతి చెప్పడంతో కోర్కె తీర్చమని డిమాండ్ చేశారు. దీనికి ఆమె నిరాకరించడంతో ముగ్గురు కలిసి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. 
 
ఈ కామాంధుల నుంచి తప్పించుకుని బిగ్గరగా అరుస్తూ స్టేషన్ కిందికి దిగివచ్చి, విధుల్లో ఉన్న పోలీసు కానిస్టేబుల్‌కు చెప్పింది. ఆయన తిరువాన్మియూరు పోలీసులకు సమాచారం చేరవేయడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు.. అత్యాచార యత్నానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.13,999కి తగ్గిన జియోమీ ఎమ్ఐ ఏ2