Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాయ్‌పూర్‌లో వితంతువును బెదిరించి గ్యాంగ్ రేప్

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌ నగర శివారు ప్రాంతంలో ఓ వితంతువుపై సామూహిక అత్యాచారం జరిగింది. హోటల్‌లో పని చేసే సహోద్యోగి నమ్మించి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళగా ఈ దారుణం జరిగింది.

రాయ్‌పూర్‌లో వితంతువును బెదిరించి గ్యాంగ్ రేప్
, బుధవారం, 27 డిశెంబరు 2017 (13:56 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌ నగర శివారు ప్రాంతంలో ఓ వితంతువుపై సామూహిక అత్యాచారం జరిగింది. హోటల్‌లో పని చేసే సహోద్యోగి నమ్మించి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళగా ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాయ్‌పూర్‌కు చెందిన వితంతువు ఓ హోటల్‌లో కిచెన్‌లో పాచిపని చేస్తూ వస్తోంది. అదే హోటల్‌లో పని చేస్తున్న సురేశ్ సాహు(24) అనే యువకుడితో ఈమెకు పరిచయం ఏర్పడి, అది మరింత సన్నిహితంగా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆమెకు మాయమాటలు చెప్పి నిర్జనప్రదేశానికి తీసుకెళ్లాడు. 
 
అక్కడ ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించగా, ఆమె ప్రతిఘటించి, కేకలు వేసింది. ఈ కేకలు ఆలకించి ముగ్గురు వ్యక్తులు అక్కడకు చేరుకుని సాహును బెదిరించి తరిమిగొట్టారు. అనంతరం ఈ ముగ్గురు కలిసి ఆ వితంతువుపై అత్యాచారానికి పాల్పడ్డారు. పైగా, ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బాధితురాలిని బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో స్మార్ట్ ఫోన్లు అమ్మకం కోసం గూగుల్ స్టోర్లు