Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాంగ్రెస్ కోరుకుంటే అమేథీ నుంచి పోటీ చేస్తా.. ప్రియాంక గాంధీ భర్త

robert vadra

సెల్వి

, మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (15:46 IST)
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఒకప్పుడు 2019 వరకు కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించే అమేథీ ప్రజలు తమకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నారని, అయితే అధిష్టానిదే తుది నిర్ణయమని చెప్పారు. 
 
ప్రజలు తమ కోసం పనిచేస్తూనే తనను ఎల్లప్పుడూ బలపరుస్తున్నారని పార్టీ భావిస్తే తాను వెనుకాడబోనని వాద్రా అన్నారు. "క్రియాశీల రాజకీయాల్లో నా పాత్ర విషయానికొస్తే, నేను వారి కోసం పనిచేసినప్పుడు ప్రజలు ఎల్లప్పుడూ నన్ను బలపరిచారు.. దేశం నేను క్రియాశీల రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటుంది.

నేను మార్పు తీసుకురాగలనని కాంగ్రెస్ పార్టీ భావిస్తే, నేను చేస్తాను. నేను అమేథీ నుంచి పోటీ చేయాల్సిన అవసరం లేదు, మొరాదాబాద్, హర్యానా నుంచి కూడా పోటీ చేయవచ్చు" అని వాద్రా తెలిపారు. అధికార పార్టీ తనను రాజకీయ సాధనంగా ఉపయోగించుకుంటోందని, గాంధీ కుటుంబానికి సంబంధించిన సాఫ్ట్‌టార్గెట్‌గా ఉందని వాద్రా బీజేపీపై మండిపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ర్యాలీకి పిలిచి డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు.. మండదా? అందుకే రాయితో కొట్టాను???