Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీచర్ స్నానం చేస్తుండగా వీడియో తీసిన విద్యార్థి.. రెండేళ్లుగా అదేపని..

టీచర్ స్నానం చేస్తుండగా వీడియో తీసిన విద్యార్థి.. రెండేళ్లుగా అదేపని..
, మంగళవారం, 13 నవంబరు 2018 (12:03 IST)
తిరుచ్చిలో ఓ టీచర్ స్నానం చేస్తుండటాన్ని వీడియో తీసి.. బ్లాక్ మెయిల్ చేసిన విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చి, మనప్పారై, ఆవారంపట్టికి చెందిన జాన్సీ అనే మహిళ ఓ స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో స్నానం చేస్తుండగా కిటికీల ద్వారా ఎవరో తొంగి చూసినట్లు జాన్సీకి కనిపించింది. దీంతో భయపడిన జాన్సీ అరవడంతో కిటీకల ద్వారా తొంగి చూసిన వ్యక్తి పారిపోయాడు. 
 
ఇటీవల జాన్సీ ఇంటికి ఓ లెటర్ వచ్చింది. అందులో స్నానం చేస్తుండగా వీడియో తీశానని.. చెప్పినట్లు వినని పక్షంలో ఈ వీడియోను నెట్లో పెట్టేస్తానని బెదిరించినట్లుంది. ఈ విషయాన్ని బయటచెప్తే వీడియోను నెట్టో పెట్టేస్తానని జాన్సీని ఆ లేఖ ద్వారా బెదిరించాడు. దీంతో షాక్ అయిన జాన్సీ ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు జాన్సీ పక్కింటి విద్యార్థి వద్ద విచారణ జరిపారు. 
 
ఈ విచారణలో జాన్సీ స్నానం చేయడాన్ని కిటికీల ద్వారా వీడియో తీశాడని.. రెండేళ్లుగా జాన్సీ స్నానం చేస్తుండటాన్ని కిటికీల ద్వారా తొంగిచూశానని తెలిపాడు. దీంతో ఆ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎపిలో ఆపరేషన్ గరుడ పార్ట్ - బి... ఏయే నేతలున్నారో చూడండి..!