Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లి పేరుతో మోసం చేస్తే ఎన్నారైలను అరెస్ట్ చేయాల్సిందే.. సుప్రీం

పెళ్లి పేరుతో మోసం చేస్తే ఎన్నారైలను అరెస్ట్ చేయాల్సిందే.. సుప్రీం
, మంగళవారం, 13 నవంబరు 2018 (14:45 IST)
పెళ్లి పేరుతో అమ్మాయిలను మోసం చేసేవారిని అరెస్ట్ చేయాలని... సుప్రీం కోర్టు తెలిపింది. దేశానికి సంబంధించిన మహిళలను ఎన్నారై భర్తలు వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. పెళ్లి తర్వాత మోసం చేయడం, వేధింపుల లాంటి కేసులు నమోదైతే వెంటనే వారిని అరెస్ట్ చేయడంపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.


అమాయకులను ఆసరాగా తీసుకుని.. స్వదేశం నుంచి విదేశాలకు తీసుకెళ్లి.. పెళ్లి సాకుతో అదనపు కట్నం తీసుకుంటున్న సంఘటనల ఆధారంగా దేశ వ్యాప్తంగా పలు కేసులు నమోదైనాయి.
 
సర్వోన్నత న్యాయస్థానంలోనూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్) దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను నవంబర్ 13న సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ విషయంపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. మ్యారేజ్ చీటింగ్ కేసుల్లో ఎన్నారై భర్తలను తప్పనిసరిగా అరెస్ట్ చేసే విషయాన్ని పరిశీలించడంతో పాటు న్యాయస్థానానికి వివరణ ఇవ్వాలని కోరింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరకట్నం కోసం పెళ్లి ఆపేసిన తల్లిదండ్రులు.. పోలీసులు ఏం చేశారో తెలుసా?