Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమ పెళ్లి.. కాపురానికి పంపని తండ్రి.. విషంతాగి మహిళ ఆత్మహత్య

తమిళనాడులో మహిళలకు రక్షణ కరువైంది. మొన్నటికి మొన్న దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా ప్రేమించి వివాహం చేసుకున్న నెల రోజులకే ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తమిళనాడు

ప్రేమ పెళ్లి.. కాపురానికి పంపని తండ్రి.. విషంతాగి మహిళ ఆత్మహత్య
, శుక్రవారం, 20 జులై 2018 (10:38 IST)
తమిళనాడులో మహిళలకు రక్షణ కరువైంది. మొన్నటికి మొన్న దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా ప్రేమించి వివాహం చేసుకున్న నెల రోజులకే ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా స్వామిమలై సమీపం అన్నానగర్‌‌లో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే అన్నానగర్‌కు చెందిన నీలమేఘం కుమార్తె అనసూయ (24) బీటెక్‌ చదివి ఇంటివద్దే ఉంటోంది. వీరి ఎదురింటికి చెందిన సెల్వరాజ్‌ కుమారుడు పుగళేంది కేబుల్‌ టీవీలో పని చేస్తున్నాడు. పుగళేంది, అనసూయ మధ్య ప్రేమ చిగురించింది. నెలక్రితమే వీరు రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఇటీవల వీరి వివాహం గురించి ఇరువురి ఇళ్లలో తెలిసింది. దీంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. పంచాయితీ పెద్దలు కూడా వీరి వివాహం సరైనదేనని తీర్పు చెప్పారు. 
 
అయితే ఈ పెళ్లి అనసూయ తండ్రి నీలమేఘంకు నచ్చలేదు. దీంతో కుమర్తెను కాపురానికి పంపించలేదు. పైగా పుగళేంది కుటుంబసభ్యులు కూడా ఈ విషయంపై పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన అనసూయ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవిశ్వాస తీర్మానం.. నేడు ఎంతో ముఖ్యమైన రోజు.. ఎంపీలు జాగ్రత్త- మోదీ