Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాహస మహిళ : రెండు చేతులతో రెండు పాములను పట్టుకుని...

snake catches
, ఆదివారం, 6 ఆగస్టు 2023 (14:57 IST)
ఓ మహిళ తన ప్రాణాలకు తెగించి రెండు చేతులతో రెండు పాములను పట్టుకుంది. అయితే, ఈ రెండు పాములు పెనవేసుకుని ఒక్కటిగా ఉండటాన్ని గమనించిన ఆమె.. ఈ సాహసం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ ఘటన మన దేశంలో జరిగింది. కానీ ఆ ప్రాంతం మాత్రం తెలియదు కానీ, ఓ విద్యా కేంద్రంలో ఇది చోటుచేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ పాములను చూసిన ఆమె ఒక్కసారిగా కాలువలోకి దిగిపోయి రెండు చేతులతో రెండింటినీ పట్టుసుకుంది. వీటిలో ఒకటి ఆమె చేతి నుంచి తప్పించుకుని పారిపోయింది. అయినప్పటికీ వదిలిపెట్టని ఆ మహిళ... ఆ పామును కూడా పట్టుకుంది. 
 
ఈ వీడియోను చూసిన ఇన్‌స్టా యూజర్లు ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇంత సాహసం పనికిరాదంటూ హితవు పలుకుతున్నారు. మరికొందరు అయితే, ఆ పాములకు ఎందుకు అసౌకర్యం కలిగించడం అంటూ ప్రశ్నిస్తున్నారు. 
 
 
205 అడుగుల ఎత్తులో ఆగిపోయిన రోలర్ కోస్టర్ 
 
దాదాపు 205 అడుగులు ఎత్తులో ప్రయాణికులు ఆగిపోయారు. దీంతో వారంతా బిక్కచచ్చి పోయారు. సాఫీగా సాగిపోతూ వచ్చిన రోలర్ కోస్టర్ ఉన్నట్టుండి 205 అడుగుల ఎత్తులో ఆగిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తూ వచ్చిన వారంతా ప్రాణభయంతో వణికిపోయారు. ఈ ఘటన అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని శాన్‌డస్కీలోని అమ్యూజ్‌మెంట్ పార్కులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ పార్కులో ఉన్న రోలర్ కోస్టర్ 205 అడుగుల ఎత్తులో ఉన్నట్టుండి ఆగిపోయింది. దీంతో రైడ్ ఎంజాయ్ చేద్దామని దానిపైకి ఎక్కినవారు ప్రాణభయంతో వణికిపోయారు. సాంకేతిక కారణాలతో ఇది ఆగిపోయింది. దీంతో పైన చిక్కుకున్న వారిని జాగ్రత్తగా కిందికి దించారు. ఈ ఘటనలో అందరూ క్షేమంగా బయటపడటంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 
 
కానిస్టేబుల్‌ భర్తను హత్య చేసిన భార్య..  
 
విశాఖపట్టణంలో ఓ కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడు. కట్టుకున్న భార్య చేతిలోనే హతమయ్యాడు. ఈ హత్య నుంచి తప్పించుకునేందుకు నిందితురాలు అతి చేసి పోలీసుల చేతికి చిక్కింది. తమది అన్యోన్య దాంపత్యమని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసి చివరకు అడ్డంగా బుక్కైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇటీవల విశాఖపట్టణానికి చెందిన రమేశ్ అనే ఓ కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలు కీలక విషయాలను వెల్లడించారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య శివజ్యోతి.. అతన్ని అడ్డుతొలగించుకునేందుకు ఈ హత్యకు పాల్పడినట్టు తేలింది. ఆ తర్వాత తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు పడిన తాపత్రయే పలు అనుమానాలకు దారితీసింది.
 
భర్త హత్యకు కొన్ని రోజుల ముందు నుంచే అతడితో ప్రేమగా ఉన్నట్టు నిందితురాలు కొన్ని వీడియోలను తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. మద్యం మత్తులో తూలిపోతున్న రమేశ్‌ను మంచంపై పడుకోబెట్టడం, భార్య మంచిదని అతడు వీడియోలో చెప్పడం వంటి దృశ్యాలను ఆమె చాకచక్యంగా రికార్డు చేసంది. హత్య అనంతరం విచారణకు వచ్చిన పోలీసులకు శివజ్యోతి ఈ వీడియోలను కూడా చూపించి, తమది అన్యోన్య దాంపత్యమని నిరూపించుకునే ప్రయత్నం చేసింది.
 
దీంతో ఆమెను అనుమానించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైంది. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమే ఆమె ఇదంతా చేసి ఉంటుందని అనుమానించిన పోలీసులు చివరకు వాస్తవాన్ని వెలికి తీశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న శివజ్యోతి, ఏ2గా ఉన్న ఆమె ప్రియుడు, ఏ3 అయిన వెల్డర్ నీలాను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

205 అడుగుల ఎత్తులో భయంతో బిక్కచచ్చిపోయిన ప్రయాణికులు.. ఎందుకో తెలుసా?